Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె.కరాడ్ రాతపూర్వకంగా తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లోన్లు చెల్లించకుండా తప్పించుకున్న 25 సంస్థల పేర్లను ప్రకటించారు.
ఢిల్లీ, ముంబై ఫస్ట్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
5జీ స్పెక్ట్రం వేలంలో అతిపెద్ద బిడ్డర్గా నిలిచిన రిలయెన్స్ జియో ఈ సేవలను జనవరి నాటికి 9 నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైల్లో మాత్రం కొంచెం ఆలస్యంగానైనా ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే సిటీల జాబితాలో చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, జామ్నగర్ అహ్మదాబాద్, లక్నో కూడా ఉన్నాయి.
Interesting News: ఆసక్తికరమైన వార్త. ఏక్నాథ్ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు. ఆయనే..
పామాయిల్పై ఫోకస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో అదనంగా 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 19 బిలియన్ డాలర్ల విలువైన పామాయిల్ దిగుమతులను తగ్గించనుంది. ఈ మేరకు సాగు నీటి సౌకర్యాలను అందుబాటులోకి తేనుంది. భారీఎత్తున డ్యామ్లు, కాలువల నిర్మాణం చేపట్టనుంది. మొలకెత్తిన విత్తనాలను దిగుమతి చేసుకోనుంది.
పాన్ కార్డ్ మస్ట్
క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేవారికి పర్మనెంట్ అకౌంట్ నంబర్ను తప్పనిసరి చేయాలని ఆదాయపు పన్ను విభాగం భావిస్తోంది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ల నుంచి లావాదేవీల స్టేట్మెంట్లను కూడా కోరాలనుకుంటోంది. స్టాక్ మార్కెట్లలో ట్రాన్సాక్షన్లు చేసేవారికి డీమ్యాట్ అకౌంట్ రూల్స్ అమలుచేస్తున్నట్లుగానే క్రిప్టో ఇన్వెస్టర్లకూ కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక 10 కోట్లే
ఇప్పటివరకు వార్షిక టర్నోవర్ 20 కోట్ల రూపాయలున్న కంపెనీలే ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేయాల్సి ఉండగా.. ఇకపై 10 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థలు కూడా ఇ-ఇన్వాయిస్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ పరిమితిని తగ్గిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ను వెలువరించిన సంగతి తెలిసిందే.
1 శాతం డౌన్
అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు ఒక శాతం పడిపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభ దశలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో అంతకుముందు సెషన్లో వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఒపెక్ ప్లస్ ప్రొడ్యూజర్ల సమావేశానికి ముందే ఆయిల్ రేట్లు తగ్గటం గమనించాల్సిన విషయం. ప్రపంచ వృద్ధి మందగమన భయాలే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!