Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Loans Write Off Banks Wrote Off Loans In Past Five Years

Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Published Date :August 3, 2022 , 9:46 am
By Akkirala Kondala Rao
Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్‌గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కె.కరాడ్‌ రాతపూర్వకంగా తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లోన్లు చెల్లించకుండా తప్పించుకున్న 25 సంస్థల పేర్లను ప్రకటించారు.

ఢిల్లీ, ముంబై ఫస్ట్‌

Also Read

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు

5జీ స్పెక్ట్రం వేలంలో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచిన రిలయెన్స్‌ జియో ఈ సేవలను జనవరి నాటికి 9 నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైల్లో మాత్రం కొంచెం ఆలస్యంగానైనా ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే సిటీల జాబితాలో చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, జామ్‌నగర్‌ అహ్మదాబాద్‌, లక్నో కూడా ఉన్నాయి.

Interesting News: ఆసక్తికరమైన వార్త. ఏక్‌నాథ్‌ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు. ఆయనే..

పామాయిల్‌పై ఫోకస్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్‌ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో అదనంగా 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 19 బిలియన్‌ డాలర్ల విలువైన పామాయిల్‌ దిగుమతులను తగ్గించనుంది. ఈ మేరకు సాగు నీటి సౌకర్యాలను అందుబాటులోకి తేనుంది. భారీఎత్తున డ్యామ్‌లు, కాలువల నిర్మాణం చేపట్టనుంది. మొలకెత్తిన విత్తనాలను దిగుమతి చేసుకోనుంది.

పాన్‌ కార్డ్‌ మస్ట్‌

క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేవారికి పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ను తప్పనిసరి చేయాలని ఆదాయపు పన్ను విభాగం భావిస్తోంది. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల నుంచి లావాదేవీల స్టేట్‌మెంట్లను కూడా కోరాలనుకుంటోంది. స్టాక్‌ మార్కెట్లలో ట్రాన్సాక్షన్లు చేసేవారికి డీమ్యాట్‌ అకౌంట్‌ రూల్స్‌ అమలుచేస్తున్నట్లుగానే క్రిప్టో ఇన్వెస్టర్లకూ కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇక 10 కోట్లే

ఇప్పటివరకు వార్షిక టర్నోవర్‌ 20 కోట్ల రూపాయలున్న కంపెనీలే ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌లను జారీ చేయాల్సి ఉండగా.. ఇకపై 10 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న సంస్థలు కూడా ఇ-ఇన్వాయిస్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ పరిమితిని తగ్గిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ను వెలువరించిన సంగతి తెలిసిందే.

1 శాతం డౌన్‌

అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు ఒక శాతం పడిపోయాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ప్రారంభ దశలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో అంతకుముందు సెషన్‌లో వచ్చిన లాభాలకు బ్రేక్‌ పడింది. ఒపెక్‌ ప్లస్‌ ప్రొడ్యూజర్ల సమావేశానికి ముందే ఆయిల్‌ రేట్లు తగ్గటం గమనించాల్సిన విషయం. ప్రపంచ వృద్ధి మందగమన భయాలే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • banking sector
  • Bhagwat K Karad
  • business news
  • central minister
  • financial updates

తాజావార్తలు

  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

  • Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions