వడ్లు కొనకపోతే బీజేపీ ఆఫీసుపై పారబోస్తాం : కేసీఆర్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే… బీజేపీ పార్టీ ఆఫీసుపై పారబోస్తామని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా? ఒక్కటే మాట సాఫ్ సీదా చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు.. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని ఆగ్రహించారు.
ధాన్యం కొనుగోలుకు విషయాన్ని అర్థం చేసుకునే ఇంకిత జ్ఞానం కేంద్రానికి లేదు.. దానికి వ్యతిరేకంగా ఇవాళ యుద్ధం మొదలైందన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేస్తున్నారు.. కొనే బాధ్యత ఎవరిది.. ఎవని మెడలు ఎవరు వంచాలని తెలిపారు. బీజేపీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు చెబుతోంది.. మా ఓపికకు ఓ హద్దు ఉంటుందని హెచ్చరించారు. మా సభలో కూడా కేంద్రం సీఐడీ ఉంటుంది.. రిపోర్ట్ తెప్పించు కోండన్నారు. మా పంట కొంటారా కొనరా చెప్పండి.. చేతులు జోడించి వేడుకుంటున్నామని పేర్కొన్నారు కేసీఆర్.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
-
Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్కు శాపమయ్యాయా?
-
Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్