Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Karnataka Deputy Cm Dk Shivakumar Has Made Strong Comments Against Bjp

DK Shivakumar: అవినీతిలో బీజేపీయే అగ్రగామి.. డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

Published Date :July 26, 2024 , 3:38 pm
By Rajesh Veeramalla
  • కర్ణాటకలో ముడా కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు
  • స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • అవినీతిలో బీజేపీయే అగ్రగామి- డీకే శివకుమార్
  • బీజేపీ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నారు
  • అందుకే సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారు- శివ కుమార్.
DK Shivakumar: అవినీతిలో బీజేపీయే అగ్రగామి.. డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటకలో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెడుతోన్న బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం పలు ఆరోపణలు చేశారు. అవినీతిలో బీజేపీయే అగ్రగామి అని డీకే శివకుమార్ అన్నారు. ఇప్పుడు వారు చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ బహిరంగంగా సమాధానం చెబుతుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎప్పటికీ గెలవదని బీజేపీ భావించిందని.. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని శివకుమార్ చెప్పారు. వచ్చే వారం బెంగుళూరు నుంచి మైసూరు వరకు బీజేపీ పాదయాత్రకు సంబంధించి శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ఏమైనా చేయనివ్వండి.. వీలైనన్ని ఎక్కువ మార్చ్‌లు చేయండి.. వారి ప్రచారానికి తాము స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీకే శివకుమార్ తెలిపారు.

Snake vs centipede: పాముతో జెర్రి బిగ్ ఫైట్.. చివరకు?

Also Read

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం
  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం

సీఎం సిద్ధరామయ్య ఎప్పుడూ ఫలానా ప్రాంతంలో భూమిని డిమాండ్ చేయలేదని డిప్యూటీ సీఎం చెప్పారు. చాలా మందికి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చారని.. దీనిపై సంబంధిత మంత్రి సమాధానం చెబుతారన్నారు. దీని గురించి తనకు సమాచారం కూడా వస్తోందని.. కానీ ముడా తరపున సీఎంకు ప్రత్యేక భూమి ఇచ్చే విషయంలో మాత్రం చట్టపరిధిలో మాత్రమే భూమిని కేటాయించారని తెలిపారు. మూడేళ్ల క్రితం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముడా వ్యవహారం మీడియాలో వచ్చిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇప్పుడు సీఎం ప్రతిష్టను దిగజార్చడానికే ఇలా లేవనెత్తుతున్నారని దుయ్యబట్టారు. పాదయాత్ర ప్రారంభించే విషయంలో కాంగ్రెస్‌ను బీజేపీ కాపీ కొడుతోందని విమర్శించారు. మరోవైపు.. అవినీతిలో బీజేపీ అగ్రగామి అని ఆరోపించారు. బీజేపీకి ముడా అంశం పబ్లిసిటీ స్టంట్‌. బీజేపీ తన గోతిలో తానే పడిపోతుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వంలో ముడా కుంభకోణం జరిగిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..

కాగా.. ముడా కుంభకోణంపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేశాయి. సీఎం సిద్ధరామయ్యకు ముడాలోని ప్రత్యేక నివాస ప్రాంతంలో రూ.3.16 కోట్లకు 14 ప్లాట్లు ఇచ్చారని బీజేపీ చెబుతోంది. వాటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ముడాలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సీఎం సిద్ధరామయ్య 2021లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ప్లాట్లు కేటాయించారని అన్నారు. అతని భార్య ఫలానా ప్రాంతంలో ప్లాట్లు డిమాండ్ చేయలేదని తెలిపారు. తన భార్య ఆస్తిని ముడా స్వాధీనం చేసుకున్నప్పుడు, తాను ముడా అధికారులకు సమాచారం ఇచ్చానని.. ప్రతిఫలంగా ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చారని సిద్ధరామయ్య తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • deputy cm
  • dk shivakumar
  • karnataka
  • MUDA

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ

  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions