DK Shivakumar: అవినీతిలో బీజేపీయే అగ్రగామి.. డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
- కర్ణాటకలో ముడా కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు
- స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- అవినీతిలో బీజేపీయే అగ్రగామి- డీకే శివకుమార్
- బీజేపీ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నారు
- అందుకే సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారు- శివ కుమార్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెడుతోన్న బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం పలు ఆరోపణలు చేశారు. అవినీతిలో బీజేపీయే అగ్రగామి అని డీకే శివకుమార్ అన్నారు. ఇప్పుడు వారు చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ బహిరంగంగా సమాధానం చెబుతుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎప్పటికీ గెలవదని బీజేపీ భావించిందని.. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని శివకుమార్ చెప్పారు. వచ్చే వారం బెంగుళూరు నుంచి మైసూరు వరకు బీజేపీ పాదయాత్రకు సంబంధించి శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ఏమైనా చేయనివ్వండి.. వీలైనన్ని ఎక్కువ మార్చ్లు చేయండి.. వారి ప్రచారానికి తాము స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీకే శివకుమార్ తెలిపారు.
Snake vs centipede: పాముతో జెర్రి బిగ్ ఫైట్.. చివరకు?
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
సీఎం సిద్ధరామయ్య ఎప్పుడూ ఫలానా ప్రాంతంలో భూమిని డిమాండ్ చేయలేదని డిప్యూటీ సీఎం చెప్పారు. చాలా మందికి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చారని.. దీనిపై సంబంధిత మంత్రి సమాధానం చెబుతారన్నారు. దీని గురించి తనకు సమాచారం కూడా వస్తోందని.. కానీ ముడా తరపున సీఎంకు ప్రత్యేక భూమి ఇచ్చే విషయంలో మాత్రం చట్టపరిధిలో మాత్రమే భూమిని కేటాయించారని తెలిపారు. మూడేళ్ల క్రితం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముడా వ్యవహారం మీడియాలో వచ్చిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇప్పుడు సీఎం ప్రతిష్టను దిగజార్చడానికే ఇలా లేవనెత్తుతున్నారని దుయ్యబట్టారు. పాదయాత్ర ప్రారంభించే విషయంలో కాంగ్రెస్ను బీజేపీ కాపీ కొడుతోందని విమర్శించారు. మరోవైపు.. అవినీతిలో బీజేపీ అగ్రగామి అని ఆరోపించారు. బీజేపీకి ముడా అంశం పబ్లిసిటీ స్టంట్. బీజేపీ తన గోతిలో తానే పడిపోతుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వంలో ముడా కుంభకోణం జరిగిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..
కాగా.. ముడా కుంభకోణంపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేశాయి. సీఎం సిద్ధరామయ్యకు ముడాలోని ప్రత్యేక నివాస ప్రాంతంలో రూ.3.16 కోట్లకు 14 ప్లాట్లు ఇచ్చారని బీజేపీ చెబుతోంది. వాటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ముడాలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సీఎం సిద్ధరామయ్య 2021లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ప్లాట్లు కేటాయించారని అన్నారు. అతని భార్య ఫలానా ప్రాంతంలో ప్లాట్లు డిమాండ్ చేయలేదని తెలిపారు. తన భార్య ఆస్తిని ముడా స్వాధీనం చేసుకున్నప్పుడు, తాను ముడా అధికారులకు సమాచారం ఇచ్చానని.. ప్రతిఫలంగా ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చారని సిద్ధరామయ్య తెలిపారు.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!