జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమం చేపట్టింది. ఈ మేరకు ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయనుంది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడాలని వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విట్టర్లో ట్యాగ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ విషయంపై మన ఎంపీలకు బాధ్యత గుర్తు చేయాలని పవన్ ఆకాంక్షించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్లో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తద్వారా ఉక్కు కార్మికులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేసే ప్రతి ట్వీట్లో #raise_placards_andhra_mp అనే హ్యాష్ ట్యాగ్ వాడాలని సూచించారు. లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని సూచించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
అయితే పవన్ పిలుపునిచ్చిన డిజిటల్ ఉద్యమానికి ఏ మాత్రం స్పందన లభిస్తుందో వేచి చూడాలి. అయినా డిజిటల్ ఉద్యమం వచ్చే లాభమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రత్యక్ష పోరాటాలు లేదా పరస్పర సంప్రదింపులు చేయడం మానేసి డిజిటల్ ఉద్యమని చెప్పడం విచిత్రంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీస్తున్నారు. ఇటీవల మంగళగిరిలో చేసిన దీక్షతో పవన్ ఏం సాధించారని.. ఇప్పుడు డిజిటల్ ఉద్యమం ఏం సాధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారి పిలుపుమేరకు డిజిటల్ క్యాంపెయిన్ విశాఖ GVMC వద్ద జరిగినది#Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant@MP_MvvOfficial @VSReddy_MP pic.twitter.com/V15OM3Wutu
— JSPShivaPrasad (@JSPShivaPrasad) December 18, 2021
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!