Jagga Reddy: కవిత బెయిల్ పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..
- ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు..
- కానీ కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం- జగ్గారెడ్డి
- కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారు- జగ్గారెడ్డి
- జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేసింది- జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు.. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసిందని తెలిపారు. కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారని.. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేసిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కి ఒప్పందాల్లో భాగంగానే బెయిల్ వచ్చిందని జగ్గారెడ్డి ఆరోపించారు. జడ్జి చెప్పకముందే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లకు ముందు సమాచారం వచ్చిందన్నారు. దేశంలో విచిత్ర పరిపాలన జరుగుతుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోయే దాంట్లో భాగమే లిక్కర్ కేసు అని పేర్కొన్నారు. బీజేపీ వ్యూహం ఏంటంటే… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ను కలుపుకునే పనిలో ఉందని తెలిపారు.
Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించిందని విమర్శించారు. కవిత బెయిల్ కండిషన్ లో భాగమే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారన్నారు. మెదక్ లో బీఆర్ఎస్ గెలుస్తది అనే పరిస్థితిలో మూడో స్థానంకి ఎందుకు పోయింది.. కవిత కోసం సొంత పార్లమెంట్ నియోజక వర్గం కేసీఆర్ వదిలేసుకున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోవడమే కారణమని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయంగా కాంగ్రెస్ ను బలహీన పరిచే ఒప్పందంలో భాగమే బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడ అని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ప్రచారం చేసి… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయని తెలిపారు. కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగమేనని పేర్కొన్నారు. సిసోడియా, కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడానికి ఆలోచించిన కోర్టులు.. కవితకు ఐదు నెలల్లో బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
Minister Damodar Rajanarsimha: రాష్ట్రంలో డెంగ్యూ విజృంభణ.. అధికారులకు దిశానిర్దేశం
బీజేపీ గెలిచిన పార్లమెంటు నియోజక వర్గాల్లో.. రేపు ఎన్నికలు అనగా బీఆర్ఎస్ ఏజెంట్లు, ఎమ్మెల్యేలు కూడా లేరన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కూడా.. కాంగ్రెస్ కి వేయకండి, బీజేపీకి వేయండి అని ప్రచారం చేశారన్నారు. బీజేపీ ఉత్తరాదిన వీక్ అయ్యింది.. దక్షిణాదిలో బీఆర్ఎస్ ను బలహీన పరిచారని తెలిపారు. ఏపీలో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని సీట్లు గెలిచిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓ పావుగా బీజేపీకి పని చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కి మంచి రోజులు బీజేపీ వల్ల వచ్చిందని.. తాము జడ్జిని తప్పు పట్టడం లేదు.. జడ్జి చెప్పక ముందే బీఆర్ఎస్ చెప్పడమేంటనేది తమ వాదన అన్నారు. మూడు రోజుల ముందే బెయిల్ వస్తుందని హడావుడి చేసిన కేసీఆర్ కుటుంబం పై న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..