Minister Damodar Rajanarsimha: రాష్ట్రంలో డెంగ్యూ విజృంభణ.. అధికారులకు దిశానిర్దేశం
- సీజనల్ వ్యాధుల కట్టడి పై మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమావేశం
- రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం
- రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు.. సంబంధిత శాఖల అధికారులతో..
- సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీజనల్ వ్యాధుల కట్టడి పై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (DH) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సీజనల్ వ్యాధుల బాధితుల వివరాలను కంట్రోల్ రూమ్ కు తెలియచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందేలా కంట్రోల్ నుండి సూచనలు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై స్పెషల్ డ్రైవ్ ను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Actor Darshan: బెంగళూర్ జైలు నుంచి బళ్లారి జైలుకి దర్శన్ తరలింపు..
Also Read
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
- Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
తెలంగాణలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు.. డెంగ్యూ, చికున్గున్యా , మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా జ్వరాలతో సహా దాదాపు అన్ని ప్రధాన సీజనల్ వ్యాధులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగాయి. వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. డెంగీ, చికున్గున్యా వంటి జబ్బులతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. ఓవైపు ఉదయమంతా ఎండలు, సాయంత్రం కాగానే వర్షాలతో భిన్న వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
Read Also: NDA: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్కి చేరిన ఎన్డీయే..
తాజావార్తలు
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!