కొత్త వేరియంట్లతో ప్రమాదం లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
కరోనా తొలివేవ్ ను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇతర దేశాల్లో కరోనా మరణాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో మరణాల సంఖ్య తక్కువగానే కన్పించింది. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాధారణ పరిస్థితి రావడానికి చాలానే సమయం పట్టింది.
Also Read
ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది.
కరోనా రెండో దశలో డెల్టా ప్లస్ వైరస్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. నాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సహకారంతో సీసీఎంబీ కరోనా వైరస్ ల ఆర్ఎన్ఏ జన్యు పరిణామ క్రమంపై నిరంతరం పరిశోధనలను చేపడుతోంది. అయితే కొత్త వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉందని, థర్డ్ ముంపు ఉందని వస్తున్న వార్తలపై తాజాగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్, సలహాదారు రాకేష్ మిశ్రా స్పందించారు. తమ సంస్థ జరుపుతున్న జోనోమ్ సీక్వెనింగ్ పరీక్షల్లో సద్వేశంలో ఎలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే డెల్టా వేరియంట్లోనే సబ్ వేరియంట్లు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు.
డేల్టా వేరియంట్లలో ఏవై4, ఏవై-33, ఏవై-27 వంటి రకాలు కన్పిస్తున్నాయని తెలిపారు. కానీ వీటి తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. వాస్తవానికి విదేశాల్లో డెల్లా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉందని ఆయన విశ్లేషించారు. మనదేశంలో ఎక్కువగా ఉండన్నారు. బెంగుళూరు తదితర నగరాల్లో సీవరేజి వాటర్ తోపాటు ఇతర నమునాలను పరిశీలించినపుడు కరోనా వ్యాప్తి తగ్గినట్లు తేలిందన్నారు. త్వరలోనే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడవ దశ మురుగునీటి సర్వేను చేపట్టనున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం శుభసూచకమన్నారు. డిసెంబర్ వరకు ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించినట్లయితే థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
-
spirit : స్పిరిట్ పోస్ట్పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!