కొత్త వేరియంట్లతో ప్రమాదం లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
కరోనా తొలివేవ్ ను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇతర దేశాల్లో కరోనా మరణాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో మరణాల సంఖ్య తక్కువగానే కన్పించింది. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాధారణ పరిస్థితి రావడానికి చాలానే సమయం పట్టింది.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది.
కరోనా రెండో దశలో డెల్టా ప్లస్ వైరస్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. నాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సహకారంతో సీసీఎంబీ కరోనా వైరస్ ల ఆర్ఎన్ఏ జన్యు పరిణామ క్రమంపై నిరంతరం పరిశోధనలను చేపడుతోంది. అయితే కొత్త వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉందని, థర్డ్ ముంపు ఉందని వస్తున్న వార్తలపై తాజాగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్, సలహాదారు రాకేష్ మిశ్రా స్పందించారు. తమ సంస్థ జరుపుతున్న జోనోమ్ సీక్వెనింగ్ పరీక్షల్లో సద్వేశంలో ఎలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే డెల్టా వేరియంట్లోనే సబ్ వేరియంట్లు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు.
డేల్టా వేరియంట్లలో ఏవై4, ఏవై-33, ఏవై-27 వంటి రకాలు కన్పిస్తున్నాయని తెలిపారు. కానీ వీటి తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. వాస్తవానికి విదేశాల్లో డెల్లా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉందని ఆయన విశ్లేషించారు. మనదేశంలో ఎక్కువగా ఉండన్నారు. బెంగుళూరు తదితర నగరాల్లో సీవరేజి వాటర్ తోపాటు ఇతర నమునాలను పరిశీలించినపుడు కరోనా వ్యాప్తి తగ్గినట్లు తేలిందన్నారు. త్వరలోనే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడవ దశ మురుగునీటి సర్వేను చేపట్టనున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం శుభసూచకమన్నారు. డిసెంబర్ వరకు ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించినట్లయితే థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!