కొత్త వేరియంట్లతో ప్రమాదం లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
కరోనా తొలివేవ్ ను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇతర దేశాల్లో కరోనా మరణాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో మరణాల సంఖ్య తక్కువగానే కన్పించింది. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాధారణ పరిస్థితి రావడానికి చాలానే సమయం పట్టింది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది.
కరోనా రెండో దశలో డెల్టా ప్లస్ వైరస్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. నాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సహకారంతో సీసీఎంబీ కరోనా వైరస్ ల ఆర్ఎన్ఏ జన్యు పరిణామ క్రమంపై నిరంతరం పరిశోధనలను చేపడుతోంది. అయితే కొత్త వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉందని, థర్డ్ ముంపు ఉందని వస్తున్న వార్తలపై తాజాగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్, సలహాదారు రాకేష్ మిశ్రా స్పందించారు. తమ సంస్థ జరుపుతున్న జోనోమ్ సీక్వెనింగ్ పరీక్షల్లో సద్వేశంలో ఎలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే డెల్టా వేరియంట్లోనే సబ్ వేరియంట్లు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు.
డేల్టా వేరియంట్లలో ఏవై4, ఏవై-33, ఏవై-27 వంటి రకాలు కన్పిస్తున్నాయని తెలిపారు. కానీ వీటి తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. వాస్తవానికి విదేశాల్లో డెల్లా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉందని ఆయన విశ్లేషించారు. మనదేశంలో ఎక్కువగా ఉండన్నారు. బెంగుళూరు తదితర నగరాల్లో సీవరేజి వాటర్ తోపాటు ఇతర నమునాలను పరిశీలించినపుడు కరోనా వ్యాప్తి తగ్గినట్లు తేలిందన్నారు. త్వరలోనే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడవ దశ మురుగునీటి సర్వేను చేపట్టనున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం శుభసూచకమన్నారు. డిసెంబర్ వరకు ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించినట్లయితే థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!