భారత్ థర్డ్వేవ్కు సిద్ధంగా ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. కరోనా ముందు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న అమెరికా సైతం మోకరిల్లిక తప్పలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఏ రేంజ్లో ఉందని. అయితే భారత్ కూడా కరోనా రక్కసి చేతుల్లో చిక్కుకొని ఎంతో విలవిలలాడింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన సెకండ్ వేవ్తో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. డెల్టా వేరియంట్ నుంచి ఇప్పడిప్పుడే భారత్ బయటపడుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు మరో సమస్యగా తయారైంది.
డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఒమిక్రాన్ వేరియంట్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో ఆయా దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ విజృంభన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మొదటగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ ఇలా రోజు రోజు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఒమిక్రాన్ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.
Also Read
గతంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందినప్పుడు కరోనా నిర్థారణకై నిర్వహించే ర్యాపిడ్ టెస్టులు, ఆర్పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ ను నెగిటివ్గా, నెగిటివ్ను పాజిటివ్గా ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ఎక్కవ శక్తివంతంగా ఉన్న క్రమంలో ఇలా అరకోరగా టెస్టులు చేసి ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం అవుతారనే భయం కూడా ప్రజల్లో లేకపోలేదు. కాన్పూర్కు చెందిన ఐఐటీ ప్రొఫెసర్ భారత్లో థర్డ్వేవ్ తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో థర్డ్వేవ్ వస్తే భారత్ ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!