ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో మల్లీ లెవల్ మార్కెంట్ అంటూ 10 లక్షల మందిని మోసం చేశారు. మాయమాటలు చెప్పి 15 వేల కోట్లు దండుకున్నారు. ఈ ఘటన ఈ సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇండస్ వివా చైర్మన్ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) అధికారులు తెలిపారు.
కొనాళ్లక్రితం ఇండస్ వివాలపై కేసు నమోదు కావడంతో ఆ కంపెనీకి చెందిన 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పడు ఆ కంపెనీ చైర్మన్ అభిలాష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసును ముందు సైబర్ క్రైం పోలీసులు వద్ద ఉండగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. అయితే చైర్మన్ అభిలాష్తో పాటు సీఏ అంజార్ను కూడా అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.