Ind vs Aus 1st ODI: ముంబైలో వాతావరణ సూచన ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించిన టీమ్ ఇండియా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC) ఫైనల్లో తమ స్థానాలను దక్కించుకున్న తర్వాత, ఈ ఏడాది 50 ఓవర్ల ప్రపంచ కప్కు సిద్ధమవుతున్నాయి ఇరు జట్లు. రెండు సిరీస్ల్లోనూ న్యూజిలాండ్, శ్రీలంకలతో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది. తొలి వన్డేలోనూ బోణి కొట్టాలని ప్లాన్ చేస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్ శుక్రవారమే మొదలవుతోంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది
Also Read:BJP: రాహుల్ లండన్ ప్రసంగంపై దుమారం.. క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్
క్రికెట్ మ్యాచ్ జరగాలంటే పరిస్థితులు అనుకూలించాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముంబైలో వర్షం పడుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేకు వాతావరణ సూచన క్రికెట్ అభిమానులకు అనుకూలంగా ఉంది. వాతావరణం క్రికెట్ మ్యాచ్కు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. తేమ 46 శాతం ఉంటుందని అంచనా. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నుండి తగ్గే అవకాశం ఉంది.
Also Read:Gold prices: పిసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈ రోజు రేటు ఎంతంటే..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఇక, తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత్కు నాయకత్వం వహించనున్నాడు హార్దిక్ పాండ్యా. సూర్యకుమార్, హార్దిక్, జడేజాలు కూడా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్ బాగానే కనిపిస్తోంది. అయితే సూర్యకు ఈ సిరీస్ పరీక్షేగా మారనుంది. టీ20ల్లో చెలరేగి ఆడే అతడు.. ఎందుకో వన్డేల్లో అలాంటి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో 18 ఇన్నింగ్స్ల్లో అతడి సగటు 28.86 మాత్రమే ఉంది. ఈ సిరీస్లోనైనా సూర్య రాణిస్తాడేమో చూడాలి. గాయాలతో శ్రేయస్, బుమ్రా దూరమవడం మాత్రం భారత్కు ప్రతికూలాంశమే. బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. బౌలింగ్ గ్రూప్ చక్కగా పని చేస్తోందని పాండ్యా చెప్పాడు. ఇక, ఆసీస్ జట్టుకు స్మిత్ నాయకత్వం వహించనున్నాడు. కమిన్స్తో పాటు హేజిల్వుడ్, జేరిచర్డ్సన్ అందుబాటులో లేకపోయినా స్టార్క్, గ్రీన్ల రూపంలో ఆసీస్కు పేసర్లే ఉన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..