భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… మొన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, నిన్న 16,764 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, ఇవాళ అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది.. ఏకంగా 22 వేలను దాటేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 406 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 8,949 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలున్నారు.. ప్రస్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్ కేసులు ఉండగా.. రివకరీ రేటు 98.32 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,431కు చేరింది.. అత్యధికంగా మహారాష్ట్రలో 454 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్లో 115, కేరళలలో 109, రాజస్థాన్లో 69, తెలంగాణలో 62 కేసులు ఉన్నాయి. ఇక, నిన్నటి కోవిడ్ కేసుల కంటే ఈ రోజు 35 శాతం అధికంగా నమోదు కావడం కలకలం రేపుతోంది.. కేసులు పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.. భారత్ దేశం ఓ పెద్ద సవాల్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారామె.