‘పుకార్లు’ పుట్టించడంలో మనమే ‘తోపులం’పో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పొరుగుంటి పుల్లకూర రుచి’ అన్నట్లుగా మనం మన విషయాల కంటే పక్కింటి సంగతులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాం. పక్కోడి విషయాలు తెలుసుకోవడంలో ఉన్న కిక్కే వేరప్పా అన్నట్లు కొందరు అదే పనిలో ఉంటారు. మరికొందరైతే చిన్న విషయాన్ని కూడా ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే చాలా స్పెషల్ గా ఉంటారు. అసలు ఏం లేకపోయినా ఏదో ఒక పుకారు సృష్టించి ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.అందుకే మన దేశంలో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసే రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అంత హిట్ అయ్యింది మరీ.. చాప అంత విషయం జరిగితే చాంతాడంత చెప్పడం మనకు అలవాటు. ఇలాంటి పుకార్లు పుట్టించడంలో ప్రపంచంలో భారతీయులను మించిన వాళ్లు లేరని తాజాగా తేలింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లదైంది..
సోషల్ మీడియాను కొందరు మంచి కోసం ఉపయోగిస్తుండగా మరికొందరేమో ఇష్టానుసారంగా ఉపయోగిస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నిజాల కంటే కూడా ఫేక్ న్యూస్ ఎక్కువయ్యాయి. దీంతో ఏది నిజం? ఏది అబద్ధం అనేది సోషల్ మీడియాలో తెలుసుకోవడం కష్టంగా మారింది. కరోనా విషయంలో ఇలాంటివి ఎక్కువగా కన్పించాయి. సోషల్ మీడియాలో కరోనాపై ఎవరికీ వారు రకరకాల పోస్టులు పెట్టడంతో పుకార్లు షికార్లు చేశాయి. కరోనా పేరు చెబితేనే ప్రజల భయపడిపోతున్న సమయంలో కొత్తకొత్తగా పుట్టికొచ్చిన పుకార్లు వారిని మరింత భయాందోళనకు గురిచేశాయి.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
ఈ పుకార్లకే కొంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే సమయంలో కొన్ని తప్పుడు పోస్టులు వైరల్ గా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం జోక్యం చేసిన వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరోవైపు సైంటిస్టులు సైతం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడంతో కొంతమందికి అసలు నిజాలు తెలిసి వచ్చాయి. ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్, మందుల విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా ఈ వ్యాక్సిన్లు వాటిపై పని చేస్తాయా? లేదా అన్నట్లు పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. కరోనా టీకా డోసుల విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇలాంటి పుకార్లు మన ఇండియాలో ఎక్కువగా ప్రచారమైనట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని వేరే దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి పుకార్లు ఎక్కువగా జరుగుతున్నాయా? అనే విషయంపై ఇటీవల ఓ సర్వే జరిగింది.
మొత్తంగా 130 దేశాల్లో అసత్య ప్రచారాలు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 18.07శాతం స్కోరుతో భారత్ టాప్ ప్లేసులో నిలిచిందని సర్వే ప్రకటించింది. దీంతో పుకార్లు సృష్టించడంలో భారతీయులే తోపులని తేలిందన్న మాట. ఏదిఏమైనా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల వల్ల ఎక్కువ హానీ కలిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మాత్రం సోషల్ మీడియా నిర్వాహకులపైనే ఉంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..