Palnadu: పల్నాడులో దారుణం.. భార్యను చంపి రైల్వేట్రాక్ దగ్గర పడేసిన భర్త
- పల్నాడులో దారుణం
- భార్యను చంపి రైల్వేట్రాక్ దగ్గర పడేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొంత మంది వివాహేతర సంబంధాల కోసం హత్యలకు తెగబడుతుంటే.. ఇంకొందరు కుటుంబ కలహాలతో జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్నారు. ఇలా ఎక్కడో చోట నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. క్షణికావేశంలో కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Also Read
పల్నాడు జిల్లాలోని నకిరికల్లు శివారు ప్రాంతం దుప్పలకొండ ఏరియాలో రైల్వే ట్రాక్ దగ్గర మహిళ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతురాలు తోరటి మేరీ(29)గా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే భార్యను చంపి రైల్వేట్రాక్ దగ్గర పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీని పరిశీలించగా బైక్పై మేరీని తీసుకెళ్తున్నట్లుగా కనిపించింది. భర్త రమేష్ను నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఆంతర్యమిదేనా?
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!