Delhi: రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఆంతర్యమిదేనా?
- రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు
- రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వరుస భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆదివారం గంట వ్యవధిలోనే ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దేశ వ్యాప్తంగా రాజకీయ ఊహాగానాలు తీవ్రం అవుతున్నాయి. ఏదో జరుగుతుందని చర్చ నడుస్తోంది. ఇటీవల మోడీ బ్రిటన్, మాల్దీవుల పర్యటన చేపట్టారు. ఆ పర్యటన తర్వాత రాష్ట్రపతిని కలిశారు.
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
Also Read
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా సభ సజావుగా నడవడం లేదు. ఆపరేషన్ సిందూర్పై చేపట్టిన చర్చ మాత్రమే కొంచెం ప్రశాంతంగా నడిచింది. మిగతా సమయం అంతా బీహార్లో చేపట్టిన ఓటర్ సర్వేపైనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. తక్షణమే సర్వేను నిలిపివేయాలని.. దానిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కాపై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
వాస్తవానికి ఈ సమావేశాల్లో అనేక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేసింది. కానీ సభ మాత్రం నడవడం లేదు. క్రీడా సంస్థల పనితీరులో ఎక్కువ పారదర్శకతను కల్పించే జాతీయ క్రీడా పాలన బిల్లును ఆమోదించేందుకు జాబితా చేసింది. అలాగే ఆగస్టు 13 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలల పాటు పొడిగించాలని హోంమంత్రి అమిత్ షా చేసిన తీర్మానం ఆమోదానికి జాబితా చేసింది. కానీ సభ సరిగ్గా నడవడం లేదు. అయితే ప్రతిపక్షాల నిరసనలను పట్టించుకోకుండా ఈ వారం ఉభయసభలు సజావుగా సాగించేందుకు అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతితో ఇరువురి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మోడీ భేటీపై అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడ లేదు.
బిల్లులు..
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం పార్లమెంటులో జాతీయ క్రీడా పాలన బిల్లు-2025ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగించాలనే తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
Called on Hon’ble President Smt. Droupadi Murmu Ji at Rashtrapati Bhavan. pic.twitter.com/6hjgTcPAZD
— Amit Shah (@AmitShah) August 3, 2025
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!