Governor Tamilisai: నేను ఎవ్వరినీ కించపరచటం లేదు.. నన్ను అవమానించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమై.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తనకు ఎదురైన అనుభవాలు, కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. తదితర అంశాలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. నేను ఎవ్వరిని కించపరచటం లేదు.. కానీ, నన్ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమిత్ షాతో అన్ని అంశాలపై చర్చించాను.. ప్రజలకు కావాల్సిన అన్ని అంశాలు చర్చకు వచ్చాయన్న ఆమె.. ఈ నెల 11న భద్రాచలం వెళ్తానని.. రోడ్ మార్గాన మాత్రమే ప్రయాణిస్తానని వెల్లడించారు.
Read Also: Adimulapu Suresh: సీఎం జగన్ కోసం తల కోసుకోవడానికైనా సిద్ధం..!
Also Read
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
నేను ఈ విషయాలను ప్రజల ముందు పెడుతున్నాను.. సోదరిగా నైనా నాకు గౌరవం ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు గవర్నర్ తమిళిసై.. నన్ను అవమానించారన ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. కానీ, రాజ్ భవన్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడయినా రావొచ్చు అన్నారు.. నాతో ఉన్న సమస్యలపై చర్చించండి అని సూచించిన ఆమె.. గౌరవం ఇవ్వటం లేదన్నది మాత్రం వాస్తవం అన్నారు.. రాజ్ భవన్ను గౌరవించాలి స్పష్టంగా చెప్పేశారు.. నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమే.. ప్రజలకు మేలు జరిగేలా హోం మంత్రితో చర్చించామన్నారు. ఎవరి సహకారం అందకపోయినా ముందుకు వెళ్తానన్న ఆమె.. తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలిసిందేనన్నారు. నేను మేడారం వెళ్తే అధికారులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ పర్యటించాలంటే రోడ్డు మార్గమే దిక్కంటూ వ్యాఖ్యానించారు.. శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళ్తానని వెల్లడించిన ఆమె.. ఈ మధ్యే యాదాద్రికి వెళ్తే ఒక్క అధికారి రాలేదన్నారు. ఇక, తన మేడారం పర్యటనలో ఏం జరిగిందో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మీడియాకు చెప్పారనే విషయాన్ని గుర్తుచేశారు గవర్నర్ తమిళిసై. కాగా, ఇప్పటికే రాజ్భవన్కు తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరగగా.. గవర్నర్ ఢిల్లీ పర్యటన, ఆమె వ్యాఖ్యలతో మరింత దుమారం రేగేలా ఉంది.
తాజావార్తలు
-
Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Alcohol Effects: మద్యం కాలేయానికే కాదు.. మెదడుకూ ముప్పే..! వైద్యుల హెచ్చరిక
-
Vastu Mistakes: ఎంత సంపాదించినా పైసా మిగలట్లేదా? మీ బాత్రూమ్లోని ఈ 3 తప్పులే దానికి కారణం! అవి ఏంటో తెలుసా
-
Pathani Haar: ఆమిర్ ఖాన్ భార్య మెడలో మెరిసిన హైదరాబాదీ పఠానీ హార్.. అందరి చూపు దానిపైనే!
-
Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!