బస్సు ప్రమాదం నుంచి బయటపడి.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.బయటకు రాలేకే మృతిచెందారు. ప్రమాదంలో వెంటనే బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరణించినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు వున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశాలు జారీచేశారు. హుటాహుటిన జంగారెడ్డిగూడెం బయలు దేరారు మంత్రి ఆళ్ల నాని. జంగారెడ్డిగూడెం అధికారులతో ప్రమాదం ఘటనపై సమీక్షించనున్నారు. ఇదిలా వుండగా బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ రాజబాబు ప్రమాదం జరిగిన తీరుని వివరించారు. వాగులో పడిన వెంటనే తాడుసాయంలో బయటకు వచ్చామని, తనతో పాటు మరికొందరిని రక్షించానన్నారు. ఒళ్ళంతా నొప్పులుగా వున్నాయని, ఆస్సత్రిలో చికిత్స తీసుకున్నానన్నారు రాజబాబు.
Also Read
ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు చంద్రబాబు, లోకేష్, సోము వీర్రాజు, పవన్.
బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ.

తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!