EMK: టీఆర్పీల్లో తుస్సుమన్న పూనకాల ఎపిసోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్కు ఏకంగా సూపర్స్టార్ మహేష్బాబు లాంటి హీరోను ముఖ్య అతిథిగా తీసుకువచ్చినా టీఆర్పీ రేటింగ్లో మాత్రం నిర్వాహకులకు చుక్కెదురైందనే చెప్పాలి.
Read Also: ‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేల్ వెర్షన్.. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి
Also Read
ఎన్టీఆర్-మహేష్బాబు కలిసి నటించిన ఎపిసోడ్కు పూనకాల ఎపిసోడ్ అని నిర్వాహకులు భారీ ఎత్తున ప్రచారం చేసినా టీఆర్పీ మాత్రం ఊహించిన విధంగా రాలేదు. ఈ ఎపిసోడ్కు కేవలం 4.9 టీఆర్పీ మాత్రమే నమోదైంది. అయితే గతంలో రామ్చరణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్కు ఏకంగా 11.4 టీఆర్పీ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో సగం రేటింగ్ కూడా మహేష్బాబు ఎపిసోడ్కు రాకపోవడం నిర్వాహకులను నిరుత్సాహపరిచింది. కాగా ఇదే వారంలో జెమినీ టీవీ పాగల్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టెలీకాస్ట్ చేయగా 5.2 టీఆర్పీ రావడం గమనార్హం.
#EvaruMeeloKoteeswarulu With #MaheshBabu As Guest On #GeminiTV Gets 4.90 TRP
— T2BLive.COM (@T2BLive) December 16, 2021
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..