హుజురాబాద్ బైపోల్: గెలుపు క్రెడిట్ ఈటలదా? బీజేపీదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్లో బీజేపీ గెలిచిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. సాంకేతికంగా మాత్రమే బీజేపీది గెలుపుగా భావించాలి. దీనికి కారణం ఈటల రాజేందర్. నిజానికి ఈ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య జరగలేదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్గానే సాగింది. అందుకే ఈ గెలుపును చూసి బీజేపీ ఎంతమాత్రం పొంగిపోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.
గతంలో హుజురాబాద్లో బీజేపీకి కనీసం క్యాడర్ లేదు. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకున్న దాఖలాలు కూడా లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 1,683 మాత్రమే. అయితే ఈటల రాజేందర్ చేరిన తర్వాత బీజేపీకి ఉన్న అరకొర నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో హుజురాబాద్లో ఈటల అంటే బీజేపీ.. బీజేపీ అంటే ఈటల అని ప్రచారం సాగింది. అంతేకాకుండా ప్రచారం సమయంలోనూ ఈటల ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం గుర్తు గురించి మాత్రమే ప్రచారం చేశారు.
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
పైగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈటలపై కాకుండా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరగడానికి కారణం బీజేపీ అని మంత్రి హరీష్ రావు స్వయంగా విమర్శలు చేశారు. అయితే ఈటల మాత్రం ఈ ఎన్నిక బీజేపీకి సంబంధించింది కాదని.. తన ఆత్మగౌరవానికి సంబంధించిందనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. మరోవైపు ఈటల బీజేపీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని పలువురు సూచించారు. దీన్ని బట్టి హుజురాబాద్ విజయం క్రెడిట్ ముమ్మాటికీ ఈటలదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈటల గెలుపుతో బీజేపీ తెలంగాణలో మళ్లీ పుంజుకుందని చెప్పలేం. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా రఘునందన్రావును చూసే ప్రజలు ఓట్లు వేశారు తప్పితే.. బీజేపీకి కాదు. కానీ ఈ విషయాన్ని బీజేపీ గాలికొదిలేసింది. నిజంగా బీజేపీ తెలంగాణలో బలపడితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా కమలం పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఈ ఉప ఎన్నిక ప్లస్ అవుతుందో లేదో అన్న విషయం పక్కన పెడితే.. ఉద్యమనాయకుడిగా ఈటలకు ఉన్న గుర్తింపును ఈ ఉప ఎన్నిక మరింత పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: బద్వేల్ బైపోల్: కుదేలైన జాతీయ పార్టీలు
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!