హుజురాబాద్ బైపోల్: గెలుపు క్రెడిట్ ఈటలదా? బీజేపీదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్లో బీజేపీ గెలిచిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. సాంకేతికంగా మాత్రమే బీజేపీది గెలుపుగా భావించాలి. దీనికి కారణం ఈటల రాజేందర్. నిజానికి ఈ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య జరగలేదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్గానే సాగింది. అందుకే ఈ గెలుపును చూసి బీజేపీ ఎంతమాత్రం పొంగిపోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.
గతంలో హుజురాబాద్లో బీజేపీకి కనీసం క్యాడర్ లేదు. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకున్న దాఖలాలు కూడా లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 1,683 మాత్రమే. అయితే ఈటల రాజేందర్ చేరిన తర్వాత బీజేపీకి ఉన్న అరకొర నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో హుజురాబాద్లో ఈటల అంటే బీజేపీ.. బీజేపీ అంటే ఈటల అని ప్రచారం సాగింది. అంతేకాకుండా ప్రచారం సమయంలోనూ ఈటల ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం గుర్తు గురించి మాత్రమే ప్రచారం చేశారు.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
పైగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈటలపై కాకుండా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరగడానికి కారణం బీజేపీ అని మంత్రి హరీష్ రావు స్వయంగా విమర్శలు చేశారు. అయితే ఈటల మాత్రం ఈ ఎన్నిక బీజేపీకి సంబంధించింది కాదని.. తన ఆత్మగౌరవానికి సంబంధించిందనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. మరోవైపు ఈటల బీజేపీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని పలువురు సూచించారు. దీన్ని బట్టి హుజురాబాద్ విజయం క్రెడిట్ ముమ్మాటికీ ఈటలదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈటల గెలుపుతో బీజేపీ తెలంగాణలో మళ్లీ పుంజుకుందని చెప్పలేం. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా రఘునందన్రావును చూసే ప్రజలు ఓట్లు వేశారు తప్పితే.. బీజేపీకి కాదు. కానీ ఈ విషయాన్ని బీజేపీ గాలికొదిలేసింది. నిజంగా బీజేపీ తెలంగాణలో బలపడితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా కమలం పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఈ ఉప ఎన్నిక ప్లస్ అవుతుందో లేదో అన్న విషయం పక్కన పెడితే.. ఉద్యమనాయకుడిగా ఈటలకు ఉన్న గుర్తింపును ఈ ఉప ఎన్నిక మరింత పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: బద్వేల్ బైపోల్: కుదేలైన జాతీయ పార్టీలు
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!