Jobs Scam Case : తేజస్వి యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేసింది.
Also Read:Delhi Tension Live: ఢిల్లీలో హైటెన్షన్.. ఇవాళ ఈడీ ముందుకు కవిత
మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కుమార్తెలు,ఆర్జేడీ నేతల నివాసాలతో సహా బీహార్లోని పలు నగరాలు, ఇతర ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.ఢిల్లీలోని లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతితో పాటు బీహార్లోని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ఎన్సిఆర్,బీహార్లోని 15 కి పైగా ప్రదేశాలలో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఇడి ఈ సోదాలు నిర్వహించింది.
Also Read:Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఉద్యోగాల కోసం భూమి కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ను సీబీఐ బృందం ప్రశ్నించిన కొద్ది రోజుల తర్వాత ఫెడరల్ ఏజెన్సీ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ను సీబీఐ మంగళవారం రెండు సెషన్లలో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కూడా సీబీఐ సోమవారం ఆమె పాట్నా (బీహార్) నివాసంలో ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 15న తమ ముందు హాజరుకావాలని లాలూ ప్రసాద్తో పాటు ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు గత నెలలో సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం లాలూ ప్రసాద్ మరియు అతని కుటుంబ సభ్యులు కొందరు ప్లాట్లు లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!