ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్రమత్తమైన అధికారులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి.
Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్లు ధరించకుంటే…
Also Read
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
అయితే టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. డిసెంబర్ 4న సదరు వ్యక్తి టాంజానియా నుంచి వచ్చాడు. దీంతో ముంబై మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ను ట్రేసే చేసేపనిలో ఉన్నారు అధికారులు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తిస్థాయిలో ఎయిర్పోర్ట్లో పరీక్షలు చేస్తున్నారు. అయితే, టాంజానియా దేశం ఎట్ రిస్క్ జాబితాలో లేకపోవడంతో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సాధారణంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఇలా పరీక్షలకు పంపిన శాంపిల్స్లో టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరడంతో జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా అక్కడ ఒమిక్రాన్గా నిర్థారణ జరిగింది. వెంటనే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఆ వ్యక్తిని ఐసోలేషన్ కేంద్రానికి పంపి చికిత్స చేస్తున్నారు. ధారావి మురికివాడలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు వార్తలు బయటకు రావడంతో ఆ ప్రాంతం మొత్తం వణికిపోయింది. రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏడు లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటరైతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ సమయంలో ధారావి నుంచే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!