ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2022 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను ఇకపై డీరిజిస్టర్ చేస్తామని ప్రకటించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. డీరిజస్టర్ అయిన డీజిల్ వాహనాలకు ఎలాంటి ఎన్ఓసీ జారీచేయబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దశల వారీగా కాలుష్యాన్ని తగ్గించేందుకు పదేళ్లకు పైబడిన డిజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించారు.
Read: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు… చిన్నారుల చేత పనిచేయిస్తే…
అయితే, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాల విషయంలో ఇప్పటికే సర్కార్ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 ఏళ్లకు పైబడిన వాహనాలపై కఠిన నిర్ణయం తీసుకున్నది. ఈ వాహనాలను ఢిల్లీ వెలుపల కూడా తిరిగేందుకు ఎన్ఓసీ ఇవ్వబోమని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. అయితే, కాలం చెల్లిన ఈ వాహనాలను తిరిగి వినియోగించుకోవాలంటే వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకొని వినియోగంలోకి తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోలేకుంటే వాటిని స్క్రాప్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.