పడగ విప్పిన ‘ఒమిక్రాన్’.. ఊహించని విధంగా వ్యాప్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 13 దేశాలకు వ్యాప్తి చెందింది.. అంటే.. అది ఎంతవేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.. దీంతో కట్టడికి పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. సరిహద్దులను మూసివేశాయి. ఇదే సమయంలో విదేశాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది భారత ప్రభుత్వం.. వచ్చే నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని మొదట నిర్ణయించినా.. ఒమిక్రాన్ ఎఫెక్ట్తో ఆ నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని భావిస్తోంది.. ఇతర దేశాల్లో వరుసగా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండడంతో.. రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… ఇక, వైరస్ భయాలతో పలు రాష్ర్టాలు కూడా కఠిన ఆంక్షలకు పూనుకుంటున్నాయి.
ఇప్పటికే 13 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది.. సౌతాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన 600 మందిలో 61 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని నెదర్లాండ్స్ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే కాగా.. అందులో 13 మందికి ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వేరియంట్ వెలుగుచూశాక ఒక దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా నుంచి రాకపోకలపై ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఈయూ, ఇరాన్, జపాన్, న్యూజిలాండ్, థాయ్లాండ్, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, నేపాల్ తదితర దేశాలు నిషేధం కూడా విధించాయి. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను దేశంలోకి అనుమతించబోమని ఆదివారం ఇజ్రాయెల్, మొరాకో వెల్లడించాయి. అయితే, వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రపంచ సుందరీమనుల పోటీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్వానా, బెల్జియం, చెక్రిపబ్లిక్, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అంటే ఆసక్తి చూపించనివారు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక, వ్యాక్సిన్ వేసుకున్నవారిపై కూడా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావమే చూపుతుందని హెచ్చరికలు ఉన్నాయి.. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. దాని బారినపడకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!