కరోనాపై సెలవిచ్చిన నిత్యానంద.. తాను అక్కడ అడుగుపెడితేనే అంతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్ వైరస్పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.. రకరకాల వేషాలు వేస్తూ, వజ్ర, వైడూర్యాలను ధరిస్తూ ఉండే ఆయన ఫొటోలు ఎప్పటికప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాయి.. ఆయన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారిపోతుంటా.. తాజాగా, కోవిడ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. భారత్ను కరోనా మహమ్మారి ఎప్పుడు విడిచిపోతుందంటూ ఓ శిష్యుడు నిత్యానంద స్వామిజీని అడిగారట.. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. నేను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో అప్పుడే కరోనా అంతం అవుతుందంటూ సెలవిచ్చారట.. మరి 2019లో భారత్ను విడిచ పారిపోయిన.. నిత్యానంత భారత భూభాగంలో అడుగుపెట్టేది ఎప్పుడో.. కోవిడ్ అంతం అయ్యేది ఎప్పుడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!