థర్డ్ వేవ్ టెర్రర్..నిర్లక్ష్యంతో భారీ మూల్యం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్లో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో నమోదవుతున్న కేసుల్లో…50 శాతం దక్షిణాఫ్రికా వేరియంట్వే ఉంటున్నాయ్. దీనికి తోడు వారం రోజుల్లో…కరోనా, ఒమిక్రాన్ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోయాయ్. వారం క్రితం 7వేల కేసులు నమోదైతే…ప్రస్తుతం 35వేల దాటాయ్. దీంతో నిపుణులు…దేశంలో థర్డ్ వేవ్ స్టార్టయినట్లేనని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల…థర్డ్ వేవ్కు సూచికంటున్నారు. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…80 శాతం మందికి వైరస్ అటాక్ అయిందని చెబుతున్నారు. దీనికి తోడు 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని అంటున్నారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ఒమిక్రాన్ కేసులు పెరుగుదలతో…రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయ్. వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు…సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు…ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా సీరో సర్వే నిర్వహించనున్నాయ్. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు…ఆంక్షలు విధించాయ్. దేశరాజధాని ఢిల్లీలో మూడు రోజుల్లోనే 10వేల కేసులు వెలుగు చూశాయ్. ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేసిన కేజ్రీవాల్ సర్కార్…తాజాగా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. వీకెండ్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది.
అటు పంజాబ్ సర్కార్ సైతం…స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. ప్రత్యక్ష తరగతులను రద్దు చేసిన సీఎం చన్నీ…ఆన్లైన్లో క్లాసులు కొనసాగించవచ్చని సూచించారు. రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, యుపీ, పశ్చిమ బెంగాల్, గోవా సర్కార్ సైతం…నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయ్.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!