ముగిసిన సీడబ్ల్యూసీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.. పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన విధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు.
ఇక, పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది సీడబ్ల్యూసీ.. 2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది.. 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితా ఖరారు చేయనున్నారు.. ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక జరగనుండగా.. జులై 21 నుంచి 20 ఆగస్టు వరకు పీసీసీ, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పీసీసీ కార్యదర్శి వర్గం, ఏఐసీసీ సభ్యులు ఎన్నిక ఉంటుంది.. 2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్టుతెలిపారు కేసీ వేణుగోపాల్. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీ చర్చించింది.. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.. మరోవైపు, రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు. సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలు అభిప్రాయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్న రాహుల్ గాంధీ తెలిపారని తెలుస్తోంది.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో