భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి న్యాయమూర్తుకు సంబంధించిన సిఫార్సులు చేసింది.. 9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న ( కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి)తో పాటు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ భారత ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
భారత ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) గా పనిచేసిన సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ పేరును కేంద్రానికి సూచించింది కొలీజియం.. దీంతో.. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన పీఎస్ నరసింహ.. భవిష్యత్లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామయ్య కుమారుడు. కొలీజియం సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పిఎస్ నరసింహ పేరునుగనుక ప్రభుత్వం ఆమోదిస్తే, బార్ అసోసియేషన్ నుంచి ఇప్పటివరకు నేరుగా న్యాయమూర్తులుగా నియామకమైన 9 మందిలో ఒకరు కానున్నారు.