ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ఇవాళ కన్నుమూశారు.. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వరుణ్ సింగ్ను కాపాడేందుకు బెంగళూరులోని కమాండ్ ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. దీంతో.. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో.. దాంట్లో ప్రయాణం చేస్తున్న అందరూ మృతిచెందినట్టు అయ్యింది.. కాగా, ఈ నెల 8వ తేదీన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్రగాయాలతో కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.. బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు వరుణ్ సింగ్.
Read Also: తూర్పుగోదావరిలో ఒమిక్రాన్ కలకలం..!
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
ఇక, కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపై సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది భారత వాయుసేన.. ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదంలో గాయాలపాలైన కెప్టెన్ వరుణ్ సింగ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు వదిలారని.. ఆయన కుటుంబ సభ్యులకు భారత వాయుసేన సంతాపం తెలుపుతోందంటూ.. భారత వాయుసేన ట్వీట్ చేసింది. కాగా, ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురై.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 14 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక, కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!