టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభమైంది.. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై దాడికి నిరసనగా.. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్షకు దిగారు చంద్రబాబు.. 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.. ఇక, దాడిపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ చీఫ్.. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఏపీ టీడీపీ అధ్యక్శుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు.. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తదితర నేతలు కూర్చున్నారు.. మరోవైపు.. దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు.