కేంద్రంపై అసత్య ప్రచారం మానుకోండి.. పీయూష్ గోయల్ కౌంటర్
ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం.
అదనంగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం అన్నారు మంత్రి పీయూష్ గోయల్. 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం జరిగింది.ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ,13 లక్షల టన్నుల రారైస్ ఇవ్వాల్సి ఉంది. నాలుగుసార్లు గడువు కూడా పొడిగించాం.
Also Read
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
- Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారు. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పక్షాన ఉందన్నారు. మేం గత ఐదేళ్లలో కొనాల్సిన ధాన్యం కంటే.. మూడు రెట్లు ఎక్కువే కొన్నాం.
ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచి ఇచ్చాం. నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉన్నా.. రైస్ తీసుకుంటామని చెప్పాం.భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ సంతకం చేశారు. రా రైస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ మంత్రులను నేడు ఢిల్లీకి ఆహ్వానించలేదు.నేను ఢిల్లీలో లేనప్పుడు ఎందుకు వచ్చారు, ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ మంత్రులకు.. ప్రజలకు సేయడం కంటే, ఢిల్లీలో కూర్చోవడంపైనే ఆసక్తి ఉంది. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
-
Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!