తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత పురోగతి సాధించారు సీబీఐ అధికారులు… వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. రహస్యంగా ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగింది.. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సీబీఐ.. చివరకు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. జిల్లాలోని 20 మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారని చెబుతున్నారు.. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని సునీల్ యాదవ్ చెప్పడంతో తనదైన శైలిలో విచారించగా… దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయట. ఏకకాలంలో నలుగురి ఇళ్లలో ఆయుధాల కోసం సోదాలు నిర్వహించిన సీబీఐ బృందాలు.. వారిళ్లల్లోనే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు.. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ స్టేట్ మెంట్ కూడా సీబీఐ అధికారులు రికార్డు చేసినట్టుగా చెబుతున్నారు.