Nominations: ఏపీలో జోరుగా నామినేషన్లు.. మరో మూడ్రోజుల పాటు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నాల్గవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సహంగా సాగింది. నామినేషన్ల దాఖలకు ముందు కొందరు అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల నడుమ భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. అధికార, విపక్ష పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 293 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంతేకాకుండా.. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇప్పటి వరకు 1626 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మరోవైపు.. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరో మూడు రోజుల పాటు నామినేషన్లకు దాఖలుకు అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున వెళ్లి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. కొందరు అభ్యర్థులు రెండేసి.. ఇంకొందరు మూడేసి సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ఈరోజు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ తరఫున నామినేషన్ దాఖలైంది. జగన్ తరఫున పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ఈ నెల 25న సీఎం జగన్ రెండోసారి నామినేషన్ వేస్తారని, మనోహర్రెడ్డి తెలిపారు. మైదుకూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆర్వో కార్యాలయానికి వచ్చి, ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేశారు.
AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక
మరోవైపు.. గుంటూరు జిల్లా గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నేత మండలి బుద్ద ప్రసాద్, దెందులూరు నుంచిచింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్లు నామినేషన్లు దాఖలు చేశారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, తాడేపల్లిలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామిషన్ దాఖలు చేశారు. టెక్కలిలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామినేషన్ ప్రక్రియ ఘనంగా జరిగింది. కోటబొమ్మాళి నుంచి వేల మంది కార్యకర్తలతో టెక్కలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ లోక్ సభ కూటమి అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి తేజస్విని మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!