Ashok Gehlot: దేశంలో ఒకే పార్టీ పాలన.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రమాదకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. అత్యధిక రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. కొన్ని చోట్ల అధికారాన్ని మిత్ర పక్షాలతో పంచుకుంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అఖండ మెజార్టీ సాధించి.. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహ రచన చేస్తోంది. మోడీ, అమిత్ షా ప్రణాళికలతో పార్టీ దూసుకెళ్తోంది. బిజెపి, ఆర్ఎస్ఎస్లు దేశంలో ఒకే పార్టీ పాలన తీసుకురావాలనే ప్రమాదకరమైన ఉద్దేశ్యం కలిగి ఉన్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రష్యా, చైనాలను ఉదాహరణగా పేర్కొన్నారు.
Also Read:Bhatti Vikramarka : మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మనకు కావాలి
బికనీర్లోని జస్రాసర్లో జరిగిన కిసాన్ సభలో రైతులను ఉద్దేశించి గెహ్లాట్ మాట్లాడుతూ కాంగ్రెస్ రహిత భారతదేశం గురించి బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ గురించి బీజేపీ నేతలు మాట్లాడటంలో అర్థం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. దాని అర్థం – ఏకపక్ష పాలన, ఇది ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీ కూడా చాలా ప్రమాదకరమైన ఉద్దేశం అని చెప్పారు. దేశం ఈ విషయాన్ని సకాలంలో అర్థం చేసుకోకపోతే రాబోయే తరాలు నష్టపోతాయని, రష్యా, చైనాల మాదిరిగా ఎన్నికలు జరుగుతాయని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఒకే పార్టీ పాలనలో ఎన్నికలు బూటకమని, మళ్లీ మళ్లీ ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. చైనా ఒక పార్టీ వ్యవస్థ. రష్యా కాదు, కానీ ఇప్పుడు ఒక పార్టీ దాని పార్లమెంటుపై ఆధిపత్యం చెలాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఎజెండా ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని, దీన్ని దేశం అర్థం చేసుకోవాలని గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అదానీ గ్రూపు సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని గెహ్లాట్ డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో తనకున్న సంబంధాలపై కూడా ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు.
Also Read:West Bengal: భార్యతో గొడవలు.. తుపాకీతో స్కూల్లో పిల్లలను బందీచేయాలనే ప్లాన్..
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Tags
- bjp
- CM Ashok Gehlot
- Rajasthan
- RSS
తాజావార్తలు
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?