నిమజ్జనం ప్రజల హక్కు, ప్రభుత్వానిదే బాధ్యత-గణేష్ ఉత్సవ సమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ రిపోర్ట్లో లేదన్నారు భగవంత్ రావు.. నాలాలు కలుషిత నీటితోనే హుస్సేన్ సాగర్లో నీరు కలుషితం అవుతుందన్న ఆయన.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నీరు 100 శాతం కలుషితం అయ్యిందని.. 365 రోజులు పరిశ్రమల, నాళాల నీరు హుస్సేన్ సాగర్ లోకి వస్తుంటే.. కలుషితం కావడం లేదా? గణేష్ నిమజ్జనం ద్వారా హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది అని ఎవరు తేల్చారు? అని ప్రశ్నించారు.
ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు భగవంత్ రావు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా కాలుష్యం కాదన్న ఆయన.. ప్రతిష్టించిన విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలి.. విగ్రహాలు రోడ్లపై అలాగే ఉండాలా ? అని ప్రశ్నించారు.. ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఆరోపించిన భగవంత్రావు.. ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని.. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. మరోవైపు.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు చెబుతున్నాయని కామెంట్ చేసిన ఆయన.. కోర్టు తన పరిధిలో లేని విషయాలు ప్రజలపై రుద్దుతుందని వ్యాఖ్యానించారు.. కోర్టులు సంప్రదాయాలకు… ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీర్పు ఇవ్వాలన్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక, ఎకో ఫ్రెండ్లీ కలర్లు ఎక్కడ దొరుకుతాయో ప్రభుత్వం చెప్పాలని నిలదీసిన భగవంత్ రావు.. ప్రభుత్వం ఎకో ఫెండ్లీ వినాయకులను అందుబాటులో ఉంచదు.. కానీ, రసాయన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
Also Read
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
తాజావార్తలు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!