నిమజ్జనం ప్రజల హక్కు, ప్రభుత్వానిదే బాధ్యత-గణేష్ ఉత్సవ సమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ రిపోర్ట్లో లేదన్నారు భగవంత్ రావు.. నాలాలు కలుషిత నీటితోనే హుస్సేన్ సాగర్లో నీరు కలుషితం అవుతుందన్న ఆయన.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నీరు 100 శాతం కలుషితం అయ్యిందని.. 365 రోజులు పరిశ్రమల, నాళాల నీరు హుస్సేన్ సాగర్ లోకి వస్తుంటే.. కలుషితం కావడం లేదా? గణేష్ నిమజ్జనం ద్వారా హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది అని ఎవరు తేల్చారు? అని ప్రశ్నించారు.
ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు భగవంత్ రావు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా కాలుష్యం కాదన్న ఆయన.. ప్రతిష్టించిన విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలి.. విగ్రహాలు రోడ్లపై అలాగే ఉండాలా ? అని ప్రశ్నించారు.. ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఆరోపించిన భగవంత్రావు.. ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని.. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. మరోవైపు.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు చెబుతున్నాయని కామెంట్ చేసిన ఆయన.. కోర్టు తన పరిధిలో లేని విషయాలు ప్రజలపై రుద్దుతుందని వ్యాఖ్యానించారు.. కోర్టులు సంప్రదాయాలకు… ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీర్పు ఇవ్వాలన్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక, ఎకో ఫ్రెండ్లీ కలర్లు ఎక్కడ దొరుకుతాయో ప్రభుత్వం చెప్పాలని నిలదీసిన భగవంత్ రావు.. ప్రభుత్వం ఎకో ఫెండ్లీ వినాయకులను అందుబాటులో ఉంచదు.. కానీ, రసాయన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
Also Read
- UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
తాజావార్తలు
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!