హుజురాబాద్ లో కీలకంగా మారనున్న పోస్టల్ బ్యాలెట్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ పోరు జరిగింది. రఘునందన రావు కేవలం వెయ్యి డెబ్బయ్ తొమ్మిది ఓట్లతో బయటపడ్డాడు. ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అదే రిపీట్ అవుతుందని అంచనా. ఈ సారి ఎవరు అలా బయటపడతారో చెప్పలేం.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ రెండూ గెలుపు నాదంటే నాదన్న ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు చేయని ప్రయత్నం లేదు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. రాబోవు రోజుల్లో అది మరింత రసకందాయంలో పడనుంది. అయితే ఈ ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చేది పోస్టల్ బ్యాలెట్లు. హుజూరాబాద్లో 12 వేల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఇది ఈ సారి ఈ నియోజకవర్గం ప్రత్యేకత.
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ఎన్నికల కమిషన్ అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4 వేల 454 మంది ఉన్నారు. వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే 8 వేల 139 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
వృద్ధులు, వికలాంగులతో పాటు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 147 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 6 నుంచి 7 శాతం వరకు ఉంటుంది. ఇది ఎన్నికల్లో గెలుపు మార్జిన్ కావచ్చు. దీంతో హుజురాబాద్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. ప్రతి పోస్టల్ ఓటును తమకు అనుకూలంగా మలచుకోవడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పార్టీలు ఇప్పటికే ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల కార్యకర్తలు తమకు ఓటు వేయమని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!