మధ్యదరా సముద్రంలో మరో ఘోరం జరిగింది. లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న వలస దారుల పడవ ట్యునీషియా వద్ద మునిగింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందారు. 33 మందిని అధికారులు రక్షించారు. ట్యునీషియాలో వాతావరణం కొంత కుదురుకున్నాక మళ్ళీ వలసలు ప్రారంభం అయ్యాయి. పరిమితికి మించి పడవలో వలసదారులు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా ఖండం మీదుగా ఐరోపా ఖండానికి వలసలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు బంగ్లాదేశీయులని అధికారులు పేర్కొన్నారు.