Ajith Antony : బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..
బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు. అనిల్ ఆంటోనీ తన నిర్ణయం గురించి కుటుంబానికి కనీస సూచన ఇవ్వలేదని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసిన తమ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారని అజిత్ ఆంటోని చెప్పారు.
Also Read:Manish Sisodia: ప్రధాని మోడీకి తక్కువ అర్హతలు.. దేశానికి ప్రమాదకరం
అనిల్ ఆంటోనీ బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించడాన్ని చూసిన తర్వాత తన తండ్రి చాలా కృంగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇంట్లో ఒక మూలన కూర్చొని చాలా బాధ పడ్డారని తెలిపారు. తన జీవితంలో ఆయనను ఇంత బలహీనంగా ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు, అంతే అని అజిత్ ఆంటోని అన్నారు. తన సోదరుడు బీజేపీలో చేరడానికి తన సొంత కారణాలు ఉంటాయన్నారు. గుర్తు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తనకు చాలాసార్లు అసభ్యకరమైన కాల్స్ వస్తున్నాయని, అది తనను బాధించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Also Read:Karnataka polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో యశ్.. కేజీఎఫ్ హీరో కోసం ఆఫర్లు
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
కోపంతో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటారని అనుకున్నాను కానీ, బీజేపీలోకి వెళ్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అనిల్ పూర్తిగా ఊహించని నిర్ణయం తీసుకున్నారని ఆయన తమ్ముడు అజిత్ చెప్పాడు.బీజేపీలో చేరాలని అనిల్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా ఉద్రేకపూరితమైనది అని పేర్కొన్న అజిత్ ఆంటోనీ, తన తప్పులను సరిదిద్దుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు మంచిదని భావిస్తే బీజేపీలోనే కొనసాగవచ్చని అజిత్ ఆంటోని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకి మేలు జరుగుతుందని భావించి అతను బహుశా వెళ్ళి ఉండవచ్చు. కానీ, వాళ్లు (బీజేపీ) ఆయన్ను కరివేపాకులా తరిమికొడతారని పదే పదే చెబుతానుఅని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:Salman Khan: ప్రమోషన్స్ మొదలుపెట్టిన భాయ్ జాన్…
కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన అల్ఫోన్స్ కన్నంతనం, టామ్ వడక్కన్ వంటి నేతలను ఉదాహరణగా చూపుతూ అజిత్ ఆంటోనీ మాట్లాడుతూ.. బీజేపీ అందరినీ తాత్కాలికంగా వాడుకుని, వాడిన కరివేపాకులా తరిమికొడుతుందని అన్నారు. కాగా, అనిల్ ఆంటోనీ గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. భావోద్వేగానికి లోనైన ఎకె ఆంటోనీ అనిల్ ది తప్పుడు నిర్ణయం అని చెప్పిన సంగతి తెలిసిందే. తాను చచ్చే వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
- Tags
- Ajith
- AK Antony
- anil antony
- bjp
- congress
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో