ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించిన తరువాత కౌంటింగ్ ను నిలిపివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంజ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు తీర్పును ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కోట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్ఈసీ కౌంటింగ్కు సంబందించిన తేదీని ప్రకటించాల్సి ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 8 వ తేదీన రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
Read: సైదాబాద్ చిన్నారి నిందితుడు ఆత్మహత్య…