Haryana: ఉద్యోగం కోసం రష్యా వెళ్లి.. యుద్ధంలో ప్రాణాలు పొగొట్టుకున్న భారతీయ యువకుడు
- ఉక్రెయిన్లో మృతి చెందిన భారతీయ యువకుడు
- రష్యా తరపున ఉక్రెయిన్లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన రవి మౌన్
- యువకుడికి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి..
- ఉక్రెయిన్కు ఫ్రంట్లైన్ వర్కర్గా పంపించిన అక్కడి అధికారులు
- యుద్ధంలో పోరాడుతూ యువకుడు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఉక్రెయిన్లో మరణించాడు. రష్యా తరపున ఉక్రెయిన్లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన తన తమ్ముడిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకున్నారని మృతుడి సోదరుడు చెబుతున్నాడు. యువకుడికి కొన్ని రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత.. ఉక్రెయిన్కు ఫ్రంట్లైన్ వర్కర్గా పంపించారు. అక్కడ ఆ యువకుడు పోరాడుతూ మరణించాడు. యువకుడి మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్ యుద్ధంలో హతమైన యువకుడిని రవి మౌన్గా గుర్తించారు. అతని స్వస్థలం హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలోని మాటౌర్ గ్రామ నివాసి. రవి జనవరి 13న రవాణా ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడని, అయితే ఆర్మీలో రిక్రూట్ అయ్యాడని రవి సోదరుడు అజయ్ పేర్కొన్నాడు. కాగా.. తన సోదరుడి గురించి సమాచారం ఇవ్వాలని అజయ్ జూలై 21న రాయబార కార్యాలయానికి లేఖ రాశాడు. అయితే.. తన సోదరుడు మరణించినట్లు రాయబార కార్యాలయం తమకు తెలియజేసిందని చెప్పాడు. మృతదేహాన్ని గుర్తించడానికి డీఎన్ఎ పరీక్ష నివేదికను కూడా పంపాలని రాయబార కార్యాలయం కోరిందని ఆయన చెప్పారు. రవి తమతో చివరిసారిగా మార్చి 12న మాట్లాడాడని సోదరుడు అజయ్ తెలిపాడు. మరోవైపు.. అజయ్ మౌన్ తన సోదరుడి మృతదేహాన్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని.. ఎకరం భూమిని అమ్మి రష్యాకు పంపడానికి కుటుంబం రూ.11.50 లక్షలు ఖర్చు చేసిందని చెప్పారు.
Read Also: Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రష్యా పర్యటన తర్వాత.. పుతిన్ ప్రభుత్వం తన సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులను వెంటనే విడుదల చేసి, తిరిగి వచ్చేలా చూడాలని భారతదేశం చేసిన డిమాండ్ను అంగీకరించింది. అంతలోనే రవి మరణ వార్త బయటకు వచ్చింది. రష్యా తన సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను నియమించుకోవడాన్ని నిలిపివేయాలని.. దళంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించాలని భారతదేశం చేసిన డిమాండ్ను అంగీకరించడానికి రష్యా ఈ నెల ప్రారంభంలో అంగీకరించింది. రష్యన్ సైన్యం నుండి భారతీయ పౌరులందరినీ త్వరగా పంపిస్తామని రష్యా తెలిపింది.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..