Bengaluru Traffic: కారులో వెళ్తే 44 నిమిషాలు, నడిచివెళ్తే 42 నిమిషాలు.. బెంగళూర్లో ట్రాఫిక్ పద్మవ్యూహం..
- పద్మవ్యూహంగా బెంగళూర్ ట్రాఫిక్..
- కారులో వెళ్లడం కన్నా నడిచి వెళ్తేనే త్వరగా గమ్యం..
- వైరల్ అవుతున్న గూగుల్ మ్యాప్స్ స్క్రీన్ షాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Traffic: సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నగర ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటే, ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే చిక్కుకుపోతుంటాయి. ఇక వర్షాకాలం ఈ ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువ.
తాజాగా బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలను చూపెడుతూ, గూగుల్ మ్యాప్స్ ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేయగా వైరల్గా మారింది. నగరంలో కారులో వెళ్లే కన్నా, నడిచి వెళ్తేనే త్వరగా గమ్యస్థానం చేరుకుంటారని గుగూల్ మ్యాప్స్ ట్రాఫిక్ పరిస్థితిని చూపించింది. 6 కి.మీ కారులో వెళ్లడానికి 44 నిమిషాలు పడితే, నడిచి వెళ్తే 42 నిమిషాల్లో చేరుకోవచ్చని సూచించింది.
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
Read Also: Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..
ఆయుష్ సింగ్ అనే వ్యక్తి దీనిని స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుండి KR పురం రైల్వే స్టేషన్ వరకు 6 కి.మీ దూరాన్ని కారులో వెళ్లేందుకు 44 నిమిషాలు పడుతుందని, నడిచి వెళ్లే 42 నిమిషాల్లోనే చేరుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ సూచించింది.
‘‘”ఇది బెంగళూరులో మాత్రమే జరుగుతుంది’’ అంటూ అతను క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్గా మారడంతో సోషల్ మీడియాలో 3 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా మరో నెటిజన్.. ఇది ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో జరుగుతుందని, మరొకరు ముంబై, ఢిల్లీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. మరో నెటిజన్ ‘‘ భారతదేశ ట్రాఫిక్ రాజధాని’’ అని బెంగళూర్ని పిలిచారు. కొందరు ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజా రవాణాను ఎంచుకోవాలని అతడికి సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!