ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో అభిమాన హీరోకోసం వేచిచూశారు.. అయితే, ఫొటో సెషన్ లేదంటూ వచ్చిన సమాధానంతో అభిమానులు ఊగిపోయారు.. హీరో రావాల్సిందేనంటూ పట్టుబట్టారు.. ఇక, బన్నీ సాయంత్రం ఎన్-కన్వెన్షన్ సెంటర్ కు వస్తారని, ఫ్యాన్స్ మీట్, ఫొటో సెషన్ ఉంటుందంటూ వారికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. దాంతో ఫ్యాన్స్ మొత్తం గీతా ఆర్ట్స్ నుంచి ఎన్-కన్వెన్షన్కు వెళ్లిపోయారు.. ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం.. అంచనాకు మించిన ఫ్యాన్స్ రావడంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు విధించారు.. కానీ, అక్కడే తీపులాట మొదలైంది.. దీంతో.. కోపంతో ఓగిపోయిన ఫ్యాన్స్ కన్వెన్షన్ సెంటర్ గేటు విరగగొట్టడం.. బారికేడ్లను తొలగించడం.. అద్దాలు పగలగొట్టడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.. ఈ ఘటనలో కొంతమంది బన్నీ ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఇక, పరిస్థితి చేయిదాటిపోవడంతో… ఎన్- కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూడా ఫొటో సెషన్ రద్దు చేశారు.. ఫ్యాన్స్ మీట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై రాత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. ఫ్యాన్స్ మీట్లో నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది.. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. అభిమానులకు సంబంధించిన ప్రతి సమాచారం నాకు తెలియజేస్తున్నారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను.. మీ ప్రేమ అభిమానం నాకు కోట్ల ఆస్తి.. దానిని ఎప్పుడు మర్చిపోను.. అంటూ ట్వీట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా, బన్నీ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప ది రైజ్’… డిసెండర్ 17వ తేదీన విడుదలకానుంది.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
Also Read
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
— Allu Arjun (@alluarjun) December 13, 2021
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?