విమానం నుంచి జారీపడి ఆఫ్ఘన్ ఫుట్బాల్ ప్లేయర్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్ల అరచకాలకు భయపడి ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పోటీ పడ్డారు.. తాలిబన్లు కాబూల్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. కొన్ని హృదయవిదారకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.. పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ల్లోకి దూసుకెళ్లిన ప్రజలు.. ఎలాగైనాసరే ప్రాణాలతో బయటపడితే చాలు.. అనే తరహాలో.. విమానాలపైకి ఎక్కారు.. విమానాలు టేకాన్కు వెళ్తుంటే.. పరుగులు పెట్టి మరీ.. విమానాల చక్రాల దగ్గరై చోటుకోసం ప్రయత్నాలు చేశారు.. అలా విమానాలు.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులకంటే ఘోరంగా దర్శనమిచ్చాయి.. అలా విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత జారిపడి మృతిచెందిన ఘటనలు కలకలం సృష్టించాయి. ఆ ఘటనలో ఓ యువ ఫుట్బాల్ ప్లేయర్ కూడా ప్రాణాలు వదలడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్గోకి ఎగిర యూఎస్ మిలటరీ విమానం నుంచి.. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు జారీపడిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి.. అందులో 19 ఏళ్ల జాకీ అన్వారీ అనే యువ ఫుట్బాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు.. ఎంతో భవిష్యత్ ఉన్న మంచి ప్లేయర్.. ప్రాణాలు ఆకాశానికి ఎగిరిన విమానం నుంచి గాల్లో కలిసిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జూనియర్ ఫుట్బాల్ జట్టులో ఆడిన ఆ యువకుడు.. యూఎస్ మిలటరీ విమానం నుంచి కిందపడి మరణించాడు.. ఆఫ్ఘన్ స్పోర్ట్స్ సొసైటీ ఈ విషయాన్ని వెల్లడించింది. జాకీ అన్వారీ.. మంచి ప్రతిభ గలిగిన ప్లేయర్గా పేర్కొంది. కాగా, ఇక యుద్ధం ముగిసిందని ప్రకటించిన తాలిబన్లు.. మళ్లీ డోర్ టు డోర్ తనిఖీలు చేపట్టడం ఆందోళనకు గురిచేస్తోంది.. మరికొందరు తాలిబన్లకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?