Pakistan: రైలులో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులుసహా ఒక మహిళ ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ-లాహోర్ రైలులోని ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టండో మస్తీఖాన్ స్టేషన్లో రైలును ఆపి కాలిపోతున్న బోగీని వేరు చేశాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:CSK vs RR : భారీ స్కోర్ చేసిన రాజస్థాన్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే..?
సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీకి ఉత్తరాన 500 కిలోమీటర్ల (300 మైళ్లు) దూరంలో ఉన్న ఖైర్పూర్లో రైలులో మంటలు చెలరేగాయని రైల్వే అధికారి మొహ్సిన్ సియాల్ తెలిపారు. కదులుతున్న రైలు కిటికీలోంచి దూకి ఓ మహిళ చనిపోగా మంటల్లో ఆరుగురు మృతి చెందారని తెలిపారు.తెల్లవారుజామున 1:50 గంటలకు మొదటి అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు 40 నిమిషాల శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారి తెలిపారు.
Also Read
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
కాగా, పాకిస్తాన్లో నిరుపేద ప్రయాణీకులు తరచూ తమ భోజనం వండుకోవడానికి రైళ్లలో తమ సొంత చిన్న గ్యాస్ స్టవ్లను తీసుకువస్తారు. వాటిని రైళ్లలో తీసుకెళ్లేందుకు నిషేధం ఉన్నప్పటికీ.. అధికారల నిర్లక్ష్యం కారణంగా తరచు రైళ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
Also Read:INDGAP Certification : ఇండ్ గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- Tags
- Karachi
- Pakistan
- Train Fire
తాజావార్తలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!