Mayor of Ballari: 23 ఏళ్లకే మేయర్ పదవి.. చరిత్ర సృష్టించిన త్రివేణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బళ్లారి సిటీ కార్పొరేషన్కు మేయర్గా కాంగ్రెస్కు చెందిన 23 ఏళ్ల త్రివేణి ఎన్నికయ్యారు. కర్ణాటకలో అతి పిన్న వయసులో మేయర్గా రికార్డు సృష్టించారు. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్కు చెందిన బి. జానకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన త్రివేణి 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విమ్స్ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ఫార్మసీ పూర్తి చేశారు. నాలుగో వార్డు కార్పొరేటర్గా ఉన్న ఆమె మేయర్ పీఠానికి బుధవారం జరిగిన ఓటింగ్లో విజయం సాధించారు.
Also Read:Kajal Aggarwal: అందం ఆమె సొంతం.. కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్
మొత్తం 39 వార్డుల్లో కాంగ్రెస్ 26 వార్డులు, బీజేపీ 13 వార్డులు గెలుచుకున్నాయి. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఐదుగురు స్వతంత్ర సభ్యులు మద్దతు పలికారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికల్లో 28 ఓట్లతో త్రివేణి విజేతగా నిలవగా, 39 మంది కార్పొరేటర్లు ఉన్న సభలో ఆమె ప్రత్యర్థి బీజేపీకి చెందిన నాగరాతమ్మ కేవలం 16 ఓట్లను మాత్రమే సాధించగలిగారు. ఓటర్లలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ , ఎంపీలు ఉంటారు. సభ మొత్తం బలం 44.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
Also Read:Ferry Fire: ఫెర్రీలో చెలరేగిన మంటలు.. 12 మంది మృతి, ఏడుగురు మిస్సింగ్
కేవలం 13 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే 21 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్కు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలికారు. మేయర్ పదవిని ఆశించిన ముగ్గురు అభ్యర్థులు త్రివేణి, ఉమాదేవి, కుబేరప్ప ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే, ఎన్నికల్లో పార్టీ ఐక్యంగా పోటీ చేసేలా అంతర్గత తిరుగుబాటును కేపీసీసీ పరిశీలకుడు చంద్రప్ప సద్దుమణిగించారు. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ ఉమాదేవిని పోటీ నుండి వెనక్కి తీసుకోవాలని ఒప్పించారు.
Also Read:TSPSC Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. ఆ ముగ్గురి ఇళ్లల్లో సిట్ సోదాలు..?
21 ఏళ్ల వయసులో కార్పొరేటర్గా మారిన త్రివేణి.. 31 ఏళ్ల వయసులో మైసూరు సిటీ కార్పొరేషన్కు మేయర్గా మారిన తస్నీమ్ బానో నుంచి అతి పిన్న వయస్కురాలిగా రికార్డును కైవసం చేసుకున్నారు. కాగా, త్రివేణి తల్లి సుశీలాబాయి కూడా 2019-20లో ఒక సంవత్సరం పాటు బళ్లారి మేయర్గా ఉన్నారు. నేను 21 సంవత్సరాల వయస్సులో బళ్లారి నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ని అయ్యాను. ఇప్పుడు నాకు 23 సంవత్సరాల వయస్సులో మేయర్ని అయ్యాను అని త్రివేణి అన్నారు. అందరి మద్దతు తీసుకొని ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రివేణి చెప్పారు.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!