టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది
ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. దీంతో కోహ్లీ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టేది ఎవరంటూ కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ అని అంటుంటే.. మరికొందరు రాహుల్కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిక్కుముడికి సమాధానం దొరికేసింది. టీ20లకు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ఓ బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్ అనే ఛానల్కు వెల్లడించారు.
రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడని.. కోహ్లీ తర్వాత పగ్గాలు చేపట్టబోయేది అతడేనని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ విషయంలో సీక్రెట్ ఏమీ లేదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ ఈ బాధ్యతలు చేపడతాడని.. ఈ అంశంపై ప్రపంచకప్ ముగిసిన అనంతరం అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి టీమిండియాను త్వరలో ఇద్దరు సారథులు నడిపించనున్నారు. టెస్టులకు, వన్డేలకు కోహ్లీ, టీ20లకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. కాగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో మాజీ కెప్టెన్ ధోనీ జట్టు మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!