బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..!
మూడు రోజుల పాటు ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో.. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది దేవస్థానం.. ఘాట్ రోడ్ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నట్టు స్పష్టం చేసింది దేవస్థానం.. మరమ్మత్తులు, కొండచరియలు, మెష్ తదితర పనుల నిమిత్తం మే 06, 07, 08 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయనున్నారు.. అయితే, శ్రీ కనకదుర్గానగర్ మార్గం నుండి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది.. మరోవైపు.. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలని.. అక్కడ నుండి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్ ద్వారా దేవస్థానం చేరుకోవచ్చు.. ఇక, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుండి వన్ టౌన్ వైపు వచ్చే భక్తులు సీతమ్మ వారి పాదాలు వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి.. ఈ మూడు రోజులు పార్కింగ్ ప్రదేశాల నుండి దేవస్థానానికి ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్టు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఓ ప్రకటనలో పేర్కొంది..
దువ్వాడ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. ఇక, భీమిలి హత్య కేసులో సంచలన అంశాలు..!
విశాఖలో కలకలం రేపిన దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు.. దువ్వాడ పీఎస్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని గుర్తించారు.. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్యకుగురైన లక్ష్మీతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు తెలిపారు పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి విస్తు పోయే నిజాలు వెల్లడించారు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి.. ఈ కేసులో అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడిగా గుర్తించాం అన్నారు సీపీ శంఖబ్రత బాగ్చి.. హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు… నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం.. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉండేది.. అయితే, కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందడంతో.. అనంతరం లక్ష్మితో సన్నిహితంగా మెలిగాడు మిశ్రా.. నిందితుడు ఒడిశా రాష్ట్రం పూరీకి చెందినవాడిగా గుర్తించారు.. 2012లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మిశ్రా.. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి.. ఇండియాకు తిరిగి వచ్చాడు.. అయితే, అప్పులు పెరిగిపోవడంతో.. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చటానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు నిందితుడు.. లక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు.. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకున్నాడని.. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని.. ఈ కేసు ఛేదించటానికి 10 బృందాలు నియమించినట్టు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.. మరోవైపు, భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును కూడా పోలీసులు ఛేదించారు.. హత్య చేసిన క్రాంతి కుమార్ ను అరెస్టు చేశారు.. మొత్తం 6 బృందాలుగా ఏర్పడి కేసును కొలిక్కి తీసుకొచ్చారు.. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. మృతురాలు వెంకటలక్ష్మి కి క్రాంతి కూమార్ కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలిందన్నారు..
జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేత వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. బ్యాక్ పెయిన్, వాళ్లు వాయటంతో ఇబ్బంది పడుతోన్న వంశీని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు.. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.. కాగా, సత్యవర్ధన్ను భయపెట్టడం, కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ మోహన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ తరలించారు.. ఆ తర్వాత.. వంశీపై మరికొన్ని ఫిర్యాదులు రావడం.. కేసులు నమోదైన విషయం విదితమే.. ఇక, తాజాగా, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాడి ఘటనలో ఫిర్యాదుదారు సత్యవర్థన్ను బెదిరించారని, కులం పేరుతో ధూషించారనే కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది హైకోర్టు.. ఈ కేసులో వంశీ పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున కింది కోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదని.. దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.. మరోవైపు.. అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీని జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం తిరిగి సబ్ జైలుకి తీసుకెళ్లారు..
బలూచిస్తాన్లో బీఎల్ఏ ధమాకా.. 22 మంది పాక్ సైనికుల హతం..
పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నారు. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ తన బలగాలను ఎల్ఓసీ, భారత్ ఇతర సరిహద్దులకు తరలించింది. దీంతో, బీఎల్ఏ ఫైటర్స్ అక్కడ ఉన్న పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బీఎల్ఏ దెబ్బకు పలువురు పాక్ సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు. ఏప్రిల్ 29-30 మధ్య రాత్రి ప్రావిన్స్లోని తర్బాత్, డుక్కీ, తన్నుక్ ప్రాంతంలో బీఎల్ఏ జరిపిన దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. తెల్లవారుజామున జరిగిన దాడుల్లో పాక్ సైన్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలూచ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాక్ ఆర్మీ కాన్వాయ్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. బీఎల్ఏ కూడా ముగ్గురు ఫైటర్లను కోల్పోయినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్లోని కీలక పట్టణాలను బీఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుంది. కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది.
ఆస్ట్రేలియా ఎన్నికల్లో ప్రధాని ఆంథోనీ అల్బనీస్ విజయం.. పీఎం మోడీ అభినందనలు..
ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి, ప్రధానిగా ఆంథోని అల్బనీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆంథోనీ అల్బనీస్కి ప్రధాని నరేంద్రమోడీ శనివారం అభినందనలు తెలియజేశారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పారు. 21 ఏళ్ల చరిత్రలో అల్బనీస్ వరసగా రెండుసార్లు విజయం సాధించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ‘‘ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా మీరు అఖండ విజయం సాధించి తిరిగి ఎన్నికైనందుకు ఆంథోనీ అల్బనీస్కి అభినందనలు! ఈ దృఢమైన తీర్పు మీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల శాశ్వత విశ్వాసాన్ని సూచిస్తుంది’’ అని ప్రధాని మోడీ ఎక్స్లో ట్వీట్ చేశారు. భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, ఇండో-పసిఫిక్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం మా ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లుగా మోడీ చెప్పారు.
2050 వరకు భారత్లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?
ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు మధ్య వయస్సు దాటితే కాని కనిపించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం మయోపియా అని డాక్టర్లు చెబుతున్నారు. అంటే హ్రస్వదృష్టి. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కనుగుడ్డు ఉండాల్సిన దానికంటే పొడవుగా ఉంటుంది. దాంతో సరిగ్గా రెటీనా మీద కేంద్రీకృతం (ఫోకస్) కావాల్సిన కాంతికిరణాలు… రెటీనాకు కాస్త ముందే కేంద్రీకృతమవుతాయి. దాంతో దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తూ దూరాన ఉన్న వస్తువులు మాత్రం స్పష్టంగా కనిపించవు. కంప్యూటర్లు, ఫోన్లకు పరిమితమై ఎక్కువ కాలం వాటితోనే గడిపే విద్యార్థులు మయోపియా (హ్రస్వ దృష్టి) సమస్యకు లోనవుతున్నారని ఎయిమ్స్ తాజా పరిశోధనలో వెల్లడైంది.ఈ సమస్యతో సతమవుతున్న ప్రతీ ఐదుగురిలో ఒక్కరు పలురకాల దృష్టి లోపాలకు గురవటమేకాక, ఒక్కోసారి చూపుకోల్పోతున్నారని తెలుస్తోంది. దేశంలోని పాఠశాల విద్యార్థుల్లో 23 శాతం మంది దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు.
ఐపీఎల్ టికెట్స్ కోసం సూడో పోలీస్గా మారిన వ్యక్తి
ఐపీఎల్ టికెట్స్ కోసం ఓ వ్యక్తి సూడో పోలీస్ గా మారాడు.. 16 టికెట్లు కొనుగోలు చేసిన ఓ యువకుడిని బెదిరించి టికెట్లు తీసుకొని పారిపోయాడు.. సికింద్రాబాద్ బేగంపేట్ లోని జింకన్ గ్రౌండ్ వద్ద యాదగిరిగుట్టకు చెందిన రాకేష్ అనే యువకుడు తన మిత్రుల తో కలిసి 16 టికెట్లు బుక్ చేశారు.. జింకన్న గ్రౌండ్ HCA లో టికెట్లు తీసుకొని వెళ్తుండగా.. ఓ వ్యక్తి టికెట్లు కావాలంటూ వారిని ఆపాడు.. భారీగా డబ్బులు ఇస్తానంటూ చెప్పడంతో సరేనంటే ఇవ్వడానికి అంగీకరించగా, ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు చూపించాడు. తమకు డబ్బు రాలేదని చెప్పడంతో, టికెట్లు వారి వద్దను చాలు తీసుకొని.. మీరు బ్లాక్ లో అమ్ముతున్నారు నేను పోలీస్ అంటూ, పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కార్లో తీసుకువెళ్లాడు. బేగంపేట పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత మీరు ఇక్కడే ఉండండి అంటూ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతసేపు వేచి ఉన్న రాకపోవడంతో మోసపోయామని భావించిన యువకులు బేగంపేట పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు.. సిసి వీడియోల ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్..
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతూ వరుసగా పోస్టులు పెట్టేస్తోంది. ఆమె చూపించే అందాలకు భారీ ఫాలోయింగ్ కూడా వస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకానొక దశలో సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. కానీ అంతలోనే ఆమె బాలీవుడ్ బాట పట్టేసింది. అక్కడే నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కడా తగ్గకుండా స్టార్ హీరోయిన్ రేసులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే బోల్డ్ గా అందాలను ఆరబోస్తోంది. వయసు పెరుగుతున్నా, పెళ్లి అయినా తన అందం ఇంచు కూడా తగ్గలేదని తాజాగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ సారి రెడ్ కలర్ లెహంగాలో కత్తిలాంటి అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు గాలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
హిట్-3 అదిరిపోయింది.. నానికి రామ్ చరణ్ స్పెషల్ విషెస్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న స్క్రిప్ట్, విజువల్స్, తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్ అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్-3 హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రెండు రోజుల్లోనే రూ.62 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఈ వీక్ లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ ఇందులో నాని రస్టిక్ పాత్రలో వైలెన్స్ సృష్టించేశాడు. నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా చేయబోతున్నాడు. అది త్వరలోనే స్టార్ట్ కాబోతోంది.