Off The Record: లెక్క సరిపోయిందా మరి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకు పెద్ద పదవి ఇస్తారని భావించారు. అదిగో.. ఇదిగో అని ప్రచారం సాగింది కానీ.. ప్రకటన రాలేదు. వస్తాది అనుకున్న పదవీ దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రొటోకాల్ కలిగిన పోస్ట్ ఇవ్వడంతో లెక్క సరిపోయిందని భావిస్తున్నారట అధికారపార్టీ నేతలు.
రెండేళ్లకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలహీన వర్గాల నేతగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి బండ ప్రకాష్. కొన్నేళ్లుగా ముదిరాజ్ సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఒకట్రెండు పదవులు కూడా నిర్వహించారు. అలాంటి ప్రకాష్ను సీఎం కేసీఆర్ పిలిచి రాజ్యసభ సభ్యుడిని చేయడంతో గులాబీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. రెండేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తర్వాత అనూహ్యంగా ఆ పోస్టుకు రిజైన్ చేసి.. శాసనమండలి సభ్యుడయ్యారు. అప్పట్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ కూడా బండ ప్రకాష్ను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకురావడం ఓ కారణంగా చర్చ సాగింది. అప్పుడే ప్రకాష్ను మంత్రిని చేస్తారని ఓ రేంజ్లో ప్రచారం సాగినా.. కేబినెట్లో చోటు దక్కలేదు. ఏమైందో ఏమో చాన్నాళ్లు ఎమ్మెల్సీగానే ఉండిపోయారు. ఇప్పుడు తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా ప్రొటోకాల్ పదవిలో కుదురుకున్నారు ప్రకాష్.
Also Read
ముదిరాజ్లకు ప్రాధాన్యం..?
గత ఏడాది జూన్ 3 నుంచి శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టు ఖాళీగానే ఉంది. బండ ప్రకాష్ను కేబినెట్లో తీసుకోకపోతే మండలి డిప్యూటీ ఛైర్మన్ను చేస్తారని అప్పట్లో చర్చ సాగింది. కానీ.. ప్రకాష్ పేరు ఖరారు చేయడానికి ఇప్పటి దాకా సమయం తీసుకున్నారు. బండ ప్రకాష్, ఈటల రాజేందర్ ఇద్దరూ ముదిరాజ్ సామాజికవర్గమే. ఈటల బీజేపీలోకి వెళ్లిన తర్వాత ముదిరాజ్లకు కేబినెట్లో చోటు కల్పిస్తారని.. అందుకోసమే బండ ప్రకాష్ను తీసుకొచ్చారని అనుకున్నారు. తెలంగాణలో బలమైన సామాజికవర్గం కావడంతో ముదిరాజ్లకు ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చ కూడా అధికారపార్టీలో సాగింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత పరిణామాలు మారిపోయాయి. కేబినెట్లోకి ప్రకాష్ ఎంట్రీ ఆగిపోయిందని చెవులు కొరుక్కున్నారు.
ఎన్నికలు.. ఇతర సమీకరణాలతో మండలి డిప్యూటీగా ఎంపిక
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ముదిరాజ్లకు తప్పకుండా ప్రొటోకాల్ పదవి ఇవ్వాలనే ఆలోచనకు అధిష్ఠానం వచ్చిందట. అందుకే బండ ప్రకాష్ను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ను చేశారని అనుకుంటున్నారు. ఈటల బీజేపీలో యాక్టివ్గా ఉండటం.. ఇతర విపక్ష పార్టీలు ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లపై గురిపెట్టడంతో అధిష్ఠానం అలర్ట్ అయినట్టు చెబుతున్నారు. రాజ్యసభ నుంచి శాసనమండలికి ఏ ఉద్దేశంతో ప్రకాష్ను వెనక్కి తీసుకొచ్చారో.. ఆ పని పూర్తి చేయాలని తలంచి రాష్ట్రంలో పెద్దల సభకు డిప్యూటీని చేసేశారు. మొత్తానికి సామాజిక లెక్కలు బండ ప్రకాష్ నిరీక్షణకు తెరపడింది. ప్రొటోకాల్ పదవి దక్కింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..