ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు ‘ట్రిపుల్ ఆర్’ ఆదర్శం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ నుండి దర్శకధీరుడు రాజమౌళి మార్కెటింగ్ స్ట్రేటజీ పూర్తిగా మారిపోయింది. నిర్మాతలతో కలిసి రాజమౌళి ఏ భాషా చిత్రం హక్కులు ఎవరికి ఇవ్వాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనూ అదే జరుగుతోంది. అందుకే ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందు నిర్మాతలకు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి జరిగిన డిజిటల్ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని అదే ఫార్ములాను ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూ అప్లయ్ చేయబోతున్నారట నిర్మాతలు. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఇటు నెట్ ఫ్లిక్స్ కు అటు జీ 5కు నిర్మాతలు అమ్మేశారు. ‘రాధే శ్యామ్’ హిందీ వర్షన్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, ఇతర భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హక్కుల్ని జీ 5 పొందింది. ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనూ నిర్మాతలు ఇదే పని చేశారు. సో… ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడంలో ఇటు నెట్ ఫ్లిక్స్, అటు జీ 5 రెండూ కూడా ఓ అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది.
ఇంతవరకూ కాస్తంత నిదానంగా తన పావులను కదుపుతూ వచ్చిన జీ 5 సంస్థ కూడా ఇప్పుడు దక్షిణాది చిత్రాల డిజిటల్ హక్కులపై దృష్టి పెడుతోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ కు భారీ ఆఫర్స్ ఇచ్చి హక్కులను సొంతం చేసుకుంటోంది. ‘రాధేశ్యామ్’ నిర్మాతలకు ఫ్యాన్సీ అమౌంట్ ను ఆఫర్ చేసి జీ 5 ఈ నాలుగు భాషల ప్రసార హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. నిజానికి అని అనుకున్నట్టు జరిగి ఉంటే… పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ జూలై 30న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. సో…ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ఎప్పుడు ప్రకటిస్తారా అని ప్రభాస్ అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!