సుశాంత్ మిస్టరీకి ఏడాది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని నేటితో ఏడాది గడుస్తోంది. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆయన మరణించి ఏడాది గడుస్తున్నా కేసు మాత్రం ఇంకా తేలకపోవడం గమనార్హం.
నాటకీయ పరిణామాలతో అనేక మలుపులు తీసుకున్న సుశాంత్ కేసును చివరకు ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడగానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారు. దేశంలోని టాప్ ఆసుపత్రి ఎయిమ్స్ సిబిఐకి సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో సుశాంత్ అస్ఫిక్సియా (ఊపిరి ఆడకపోవడం) కారణంగా మరణించాడని తెలిసింది. సుశాంత్ మృతి సెగ బాలీవుడ్ కు గట్టిగానే తగిలిందని చెప్పాలి.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
ఆయన ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజంపై అంతకుముందెన్నడూ ఎరుగని రేంజ్ ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఇక సుశాంత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్ కోణం మరో సంచలనానికి తెరతీసింది. అందులో స్టార్స్ పేర్లు బయటకు రావడం బాలీవుడ్ కు గట్టి దెబ్బ. బాలీవుడ్ ధగధగలు వెనుక దాగున్న చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది సుశాంత్ మరణం. అప్పటికే సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రేయసి రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులోనే జైలుకు వెళ్ళింది. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ సుశాంత్ అభిమానుల ట్రోలింగ్ కు బలైంది.
ఇక ఇటీవలే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆయన అభిమానులను బాధ పెడుతోంది.
టాలెంటెడ్ హీరో సుశాంత్ తాను నటించిన కై పో చే, ఎంఎస్ ధోని, సోంచిరియా, చిచ్చోరె వంటి అద్భుతమైన చిత్రాల ద్వారా అభిమానుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతాడు. సుశాంత్ ఆఖరిగా నటించిన చిత్రం “దిల్ బెచారా”. జూలై 2020లో సుశాంత్ మరణానంతరం ఈ చిత్రం డిస్నీ హాట్స్టార్లో విడుదలై వీక్షణల పరంగా చరిత్రను సృష్టించింది. ప్రస్తుతం సుశాంత్ కేసు త్వరగా తేలాలని అభిమానులు కోరుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తోంది. ప్రస్తుతం #SushantSinghRajput అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. సుశాంత్ ను స్మరిస్తూ అభిమానులు ఈ హ్యాష్ ట్యాగ్ ను భారీ సంఖ్యలో ట్రెండ్ చేస్తున్నారు. మరి సుశాంత్ కేసులో చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!