Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్లో శాంతి..
- బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్లో శాంతి..
- అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని, సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాశ్వత శాంతి నెలకొంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. పశ్చిమ బెంగాల్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, కార్గో గేట్ ప్రారంభించిన సందర్భంగా అమిత్ చేశారు. 2026లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టవచ్చని చెప్పారు.
Read Also: Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?
Also Read
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
“సరిహద్దులు దాటడానికి చట్టబద్ధమైన మార్గం లేనప్పుడు, అక్రమ వలసలు జరుగుతాయి. అక్రమ వలసలు ఇండో-బంగ్లాదేశ్ శాంతికి హాని కలిగిస్తాయి. నేను బెంగాల్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, 2026 లో బీజేపీని గెలిపించండి. చొరబాట్లను మేము ఆపేస్తాం. చొరబాట్లు ఆగితేనే బెంగాల్లో శాంతి నెలకొంటుంది’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్ట్లు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరియు సంబంధాలను మెరుగుపరచడంలో ల్యాండ్ పోర్ట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఇవి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు.
బెంగాల్ అభివృద్ధికి ప్రధాని మోడీ పంపిన నిధులను తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. నరేంద్రమోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ. 56,000 కోట్లు ఇచ్చారని, ఈ నిధులు టీఎంసీ చేతుల్లో వెళ్లాయా..? దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. 2026లో రాజకీయ మార్పు తీసుకురావాలని అమిత్ షా బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?