నల్గొండ ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆవిడ మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినది. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదు. ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోంది. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరు. బంగారు తెలంగాణ తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ….బీరుల తెలంగాణగా మార్చారు అని అన్నారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ33 శాతం, తెలంగాణ లో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం పోస్టులు ఖాళీలే. విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా….మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా… బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆరెస్ నాయకుల కన్ను పడింది. ముస్లీంలకు వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేశారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్ అన్యాయం చేశారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరే. వైఎస్ ను కించపరిచేలా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే నేను వారి అవినీతి పై వంద మాట్లాడుతా అని పేర్కొన్నారు.